పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

437


బౌరులు సేవింప భటులుమైవంప
వారువచ్చిన లేచి, వరుసయేర్పడఁగ
నాలింగనంబుల నభినందనములఁ
జాలదీవనలఁ బూజావిశేషముల
హరిపూర్వముగ వారినందఱఁ బ్రీతిఁ
బొరయించి, మణిపీఠముల నుండఁబనిచి,
మఱదలిఁ గోడలి మఱి లోనికనిచి,
నెఱి వారినూరార్చి నిజపీఠమెక్కి
పేరుపేరునఁబిల్చి ప్రేమఁ బాండవుల
నారాజరత్న మిట్లని చెప్పఁదొడఁగె :
"అరయరు నన్ను జాత్యంధు; నిట్లేల
నరనాథులార, మిన్నక తిరుగంగ!
ఇందునందునునేల! యేనున్న కాల
మందఱు మనవలదా! యొక్క కుదుట.
ఏమిట మీకు నే హితుఁడఁగా నైతి!
నేమితలంచుక యేఁగితి రట్లు!"
అని పాండవులఁబల్కి , యందఱకన్ని
కనకగేహములిచ్చి కడఁకతోననిచె.
అప్పుడాపురమున నైదువర్షంబు
లప్పాండుసుతులు నెయ్యముఁదియ్య మెసగఁ
గౌరవసుతులతో గలిసి క్షీరంబు
నీరంబుఁగలిసిననేర్పున మెలఁగి,
హరియును దారును నధికంపుఁగూర్మి
జరియింపుచుండిరి సంతసంబునను.
అనియిట్లు జనమేజయావనీంద్రునకు
ముని చెప్పెనని చెప్ప మోదించిమునులు:
'అనఘాత్మ! తరువాతనైనవృత్తాంత
మనువొందఁజెప్పవే! యనియడుగుటయు,