పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

436

ద్విపద భారతము


కొనిపొమ్ము పార్థులఁ గుతలమేలింపు;
ఘనపుణ్య, నీవు గల్గఁగ విచారంబె!
కరుణించి మునునీవు గఱపినత్రోవ
నరుదేరఁబట్టికదా! వీరు బ్రదుకు
ట." ను నంత, ధర్మరా జతని కిట్లనియె:
"మనుజేంద్రుఁ డెపుడు మీమాటకు వెఱచుఁ
గార్యార్థమగుప్రేమఁ గలిసియుండంగ
దుర్యోధనుఁడు మాటదొరఁకొనఁ; డంత
ధార్తరాష్ట్రుల కేమితప్పుచేసితిమొ!
వార్తయునొల్లరు వసుధ మేమన్న;
నతనికిఁ బ్రతికారమాత్మలో నొల్ల;
మతనిచేఁతలకు భయంబునొందెదము.
హరియును దోడురా నరుదెంచి, యచటఁ
గురురాజు వెట్టినకూడు గుడిచెదము.”

పాం డ వు ల హ స్తి పు ర ప్ర వే శ ము


అని పయనమునకు నాయిత్తమైనఁ,
దనయు ధృష్టద్యుమ్ను ధర్మరాజునకు
బలమును దోడిచ్చి పాంచాలుఁడనుప,
వెలయంగ నారాజువీడ్కొని కదలి
ద్రౌపదివెంటరా ధౌమ్యుఁ డేతేర
నాపాండుపుత్రులు హరియును దారుఁ
గుంతీసమేతులై కురురాజుపురికి
నెంతయు లక్ష్మితో నేతెంచుచుండ,
నిట వారికెదురుగా నిభపురాధిపుఁడు
పటుగతి నందనప్రతతిఁ బుత్తెంచి,
నృపతులు సేవింప నెమ్మిఁ గొల్వునకు
నపరిమితోత్సాహుఁడై వచ్చి, యంతఁ