పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

427


హరికి సహాయులై యవనిభారంబు
హరియింపుఁ డీయింతి యాలుగానుండు.
నిదివిష్ణుసంకల్ప మేమిటఁబోదు;
మొదలధాత్రీదేవి మొఱవెట్టుకొనియె.
అనిన, నీశ్వరునాజ్ఞ నరుదెంచి మర్త్య
తనులైనయా మహాత్మకులు పాండవులు.
నాఁటినాలాయని నాథ! నీపుత్త్రి;
యేటికిఁజింతింప నిత్తుగా." కనిన,
నాశ్చర్యకలితుఁడై యపుడైనవారి
నిశ్చయింప విభుండు నేరక పలికె
“ఈవు చెప్పుదువంట! యీవలశంక
గావించువారలు గలరె సర్వజ్ఞ
వీరి నిజాత్మలు వీక్షించి కాని,
యీరూపములు నమ్మ నింతినినమ్మ;
దివ్యదర్శనమిచ్చి దృష్టింపఁ జేసి
భవ్యాత్మ నాశంకఁ బాపవే!" యనినఁ,
దాపసోత్తముఁడంతఁ దన ప్రభావమున
భూపాలునకునిచ్చె భువి దివ్యదృష్టి.
ఇచ్చిన వెలుపలికేతెంచి నృపతి
యచ్చోట నృపమూర్తులై యున్నవారి
నినకోటితేజుల హేమభూషణుల
ననిమిషనేత్రుల నమరసేవితులఁ
[1]గాసర మృగ దంతి కనకవిమాన
వాసులు యమ వాయు వాస వాశ్వినుల
నాలాయనిని బుణ్యనారినిఁజూచి,
చాలనక్కజమంది జయవెట్టి మ్రొక్కి :

  1. కాసార (మూ)