పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

426

ద్విపద భారతము


నామాయయెఱుఁగక యైశ్వర్యగర్వ
ధూమాక్షుడై వజ్ర ధూర్జటిఁ బలికె  :
'అగుర! యేఁబూర్వుండ; నపరుండు తాను;
వగ నింద్రుఁడను నేను; వరుణుండు తాను;
ననుజూచి గద్దియ నాయమా దిగఁడు!
కొనియెద నొక వ్రేటు ఘోరవజ్రమున.'
అనినఁ, జింతింపక హరుఁడు వెండియును
వనితకిట్లనె: 'వీని వనజాక్షి, కంటె!
కన్నులు వెయిగల్గి కానఁడునన్ను;
బన్నుగా నట వీనిఁబట్టితె,' మ్మనిన
నతివ నాలాయని యతనిఁబట్టుటయు,
మతి నాతఁడలరి మన్మధవికారమునఁ
బరవశుఁడై జాఱఁ, బంచబాణారి
దరహాసమున ధరాధరభేదిఁ బలికె :
'వాసవుఁడవు నీవు వరుణుండ నేను
ఈసున నాకొండ యెత్తుమా నీవు!
ఏనైన నెత్తెద నీక్షింపు.'మనిన
మానక యాకొండ మఘవుఁడెత్తినను,
ఉన్నారు వేలుపు లొక నల్వురింద్రు
లెన్నసహస్రాక్షు లిటవజ్రధరులు.
వారినింద్రుఁడుచూచి వడిఁదన్నుఁ జూచి
యూరకేచింతింప, నుగ్రుండువలికె :
'ఎక్కడ గూడినా రేవురింద్రులును!
ఒక్కఁడు జముఁ, డింద్రుఁడొక్కడు, గాడ్పు,
నిరువురశ్వినులును, నెలమినేగురును
గుఱుతుగా నాయజ్ఞఁ గూడినారిచట;
నీవెలఁదియు మీరలేవురుఁ బోయి
భూవలయంబునఁబుట్టి వేడుకను