పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/491

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

425




నేవురుఁ [1]గూడక యిప్పటిభార
మేవిధంబునఁబాయ దీవసుంధరకు.
అనుటయు దేవేంద్రుఁ : ‘డట్లేల నాకు
మనుజుఁడనై పుట్టి మరణంబునొంద !
యముఁడాఫలమ్ముఁ దానందని'మ్మనుచు
నమరాధిపతిపల్కి యట మరుచును
దెరువున గంగానదీతీరభూమి
బారిపొరి శోకించుపూఁబోఁడిఁ గాంచి,
మనసిజుచేఁతల మగ్నుడై యపుడు
తనలోన నిట్లని తలపోయఁదొడఁగె:
'అహహ ! మనోహరంబయ్యెఁ జూపులకు ;
మహి నెంతటికిలేఁడు మాయపుబ్రహ్మ !'
అనివితర్కింపుచు హరి దాన్గిఁదిసి:
“ వనజాక్షి యక్కట! వగచుచు నిచట
నెవ్వనికొంటిమై నెదురుచూచెదవు ?
ఎవ్వతెవీవు ? నీయభిలాషయేమి ?
చెప్పు.' మన్న లతాంగి: చెప్పెదఁగాని,
యిప్పుడునావెంట నింద్ర, యేతెమ్ము ;
తెలియ నొల్లకయున్నఁ దిరిగిపో.మ్మనిన,
వెలఁదిరూపవిలాస విభ్రమంబులకు
నింద్రుఁడెంతయునోడి: “ యేఁగూడివత్తుఁ
జంద్రాస్య ! పద.' మని చనఁజొచ్చి వెనుక .
తోయజూనన యింద్రుఁదోకొని యిట్లు
పోయి కైలాసాగ్రమునఁ జంద్రధరుని
సీక్షింపవచ్చుచో, నింద్రుకన్నులకు
దక్షారి వరుణుఁడై తగఁదోఁచె; దోప,

  1. గూడుక. (మూ )