పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

411


భవుపంచముఖములో! పంచవర్ణములొ!
వివరింపరాజులో! విప్రులో! చెపుఁడ;
ఆస్తోకభుజధారు లమలవర్తనులు
విస్తీర్ణవక్షులు వృషభకంధరులు
కర్ణాంతనేత్రులు కఠినైకగాత్రు
లర్ణవగంభీరు లర్థినేవురును.
విలువంచి గుఱిద్రుంచి వెలఁదివరించి
కలహించి నిర్జించి కడుమించియున్న
యతఁ డెవ్వఁ డిందులో? నందఱు నొక్క
ప్రతినుండ నితఁడని భావింపరాదు.
ఏనును బాండవు లిలలేనివగల
నూనియుండెదఁగాన నొత్తియడిగెద.
వారలుగారుగా! వటులార, మీరు,
కోరిక లట్లైనఁ గొనసాగు." ననినఁ,
బాండవాగ్రణి నవ్వి పాంచాలుఁబలికె :
"నొండేల ! పాండవేయుల మేము ద్రుపద
యమసూతి నేను; భీమార్జునుల్ వీరు;
యమలువీరిరువురు; నాయింతి కుంతి.
మహిమీఁదఁ గురురాజుమనసు రావలసి
విహరించుచుంటిమి విప్రవేషముల.
నినువంటిచుట్టము నేనెందుఁగాన;
ఘనుఁడ! లోకులకింకఁ గాననయ్యెదము"
అనవిని పాంచాలుఁ డానందలహరి
గనువ్రాల్చి గద్గదకంఠుడై తెలిసిఁ
కలరూపొకొ! యని కదలనిభీతిఁ
గలరూపకానమ్మి కడుసంభ్రమమున
నిందఱ గాఢగాఢాలింగనముల
నందందగ్రుచ్చుచు, హరిని మెచ్చుచును,