పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/461

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; సప్తమాశ్వాసము

395


ఉవిద నేఁ గైకొన్నయుడుకునఁ గాదె!
తివిఱెదరిట్లు ధాత్రీపతులెల్ల.
నాకాంక్షఁదీర్తు; రంభాదికామినులఁ
గైకొనఁజేసెదఁ గ్రమముతోడుతను ;
ధృతి నన్ను నాశీర్వదింపుఁడు చాలు
జతురత ద్రుపదరక్షణ మేనొనర్తు."
అని యర్జునుఁడు విప్రులనుమతివడసి,
తనకుఁ బాంచాలుండు తగనిచ్చినట్టి
సమరోచితాస్త్రశస్త్రములు ధరించి,
కమనీయకవచంబు గైకొని యపుడు
చలియింపకుండఁ బాంచాలి వేఱొక్క
స్థలముననుంచ ధృష్టద్యుమ్నుఁబనిచి,
భీమసహాయుఁడై పృథివీశకులముఁ
జీమలకంటె సూక్ష్మించి చూచుచును,
శరములేయుచుఁ బల్కెశక్రనందనుఁడు :
"హరిణాక్షి రాదింక నాలంబులేల!
చాలుమీయలుక! పాంచాలుపై [1]నుఱుకఁ
బోలునే! యతడేమి బొంకె మీయెడల!
గుఱియెవ్వఁడేసినఁ గూఁతునీఁగోరి
మఱికదా రప్పించె మక్కువ మిమ్ము!
జనకుండు నిలుపఁడా! జానకికొఱకు
ననలాక్షువిల్లు బ్రహ్మాభేద్యముగను;
మీకు సత్వంబున్న మృడునిపైనలుగుఁ;
డీకలహమున మీకేది జయంబు!"
అనుడు మార్గణవృష్టి నందఱు ముంప,
మనుజేంద్రు నావృష్టి మరలించి నిలిచి,

  1. నురక (మూ)