పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/457

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

391


మొగి రాజలోకసముద్రమధ్యమునఁ
దెగిన మత్స్యము వ్రాలె దృష్టింపజగము.
అప్పుడు సిగ్గును నానందగళయుఁ
దప్పక సాత్వికోదయము దీపింపఁ
బాంచాలి వెసవచ్చి పార్థుకంఠమునఁ
జంచరీకారావసంతతితోడి
పుష్పమాలికవైవఁ, బులకించి నరుఁడు
పుష్పాస్త్రముల నారువోసినట్లగుచు
నావేళఁ బ్రేమఁ గంఠాశ్లేషమర్థిఁ
గావించెనని యాత్మగణుతించుకొనియె.
ఇదిమంత్రబలమని యెన్నిరి నృపులు;
యదుకుమారులుఁ దాను హరి సంతసిల్లె.
పైపుట్టములువీచి బ్రాహ్మణులార్చి
రాపజ్జ నైదమ్ములపుడు వీక్షించి;
పురుహూతసుతుమీఁదఁ బువ్వులవాన
కురిసిరి సురలంతఁ గొనియాడి దిశల.
భేరీమృదంగాది భీమఘోషంబుఁ,
జేరి పాఠకకోటిచేయుకీర్తనము,
విప్రులు చెలఁగిదీవించు సంభ్రమము,
సుప్రసన్నతనొప్పు సురసన్నుతులును,
నేకమైయుండంగ నింద్రజుభాగ్య
మాకంజజుఁడుఁ గొనియాడలేఁడయ్యె"
అనియిట్లు జనమేజయావనీంద్రునకు
ముని చెప్పి ననిచెప్ప మోదించి వారు:
'ననఘాత్మ, తరువాతనైనవృత్తాంత
మనువొప్పఁజెప్పవే!" యనియడుగుటయు,