పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

387


కొందఱువిరిగిరి; కొందఱావిల్లు
చెందినవేడ్క వంచియు నెత్తలేక
కలఁగిరి; కొందఱు కదలించి యెత్తి
యెలమి నించుక నారియెక్కింపలేక
. . . . . . . . . . . . . . . . . .
వూపునఁదివియుచోఁ బోవునోప్రాణ
మేపునఁ బాంచాలికిట్లు భూపతుల
. . . . . . . . . . . . . . . . . .
అనుచుఁబోయిరి కృష్ణ యాత్మలోనవ్వ  ;
మునుపు కొందఱు పీఠములు డిగ్గరైరి;
ఘోరమైయున్నఁ గన్గొని కొందఱందు:
“ నీరీతిఁ బాంచాలినీనియత్నమున
ముడివెట్టెనో ! కాక, మొదల నీవిల్లు
కడఁగి యెక్కండేనిఁ గదలింపకున్నె !”
అని చూడభీతులై యందంద నిలిచి
కనుగొనుచుండిరి ఘనశరాసనము.
మఱికొంద ఱవ్విల్లు మలయుచుఁగదిసి
నెఱిఁగదల్పఁగలేక నివ్వెఱఁజనిరి.
కొంద : " ఱీవిల్లేల ! కోమలియేల !
యిందఱలోపల నీసిగ్గులేల !
ఊరకుండుటకార్య; మువిదకై నోళ్లు
నూరకుండుట కార్య మొప్పుగా" ననిరి.
అంత జరాసంధుఁ డావిల్లుగదిసి
పంతంబుతో నెత్తి ప్రజలెల్లఁ బొగడ
మిడికొప్పునకు నారి మినపగింజంత
కడమగా నెక్కించి గ్రక్కునవిడిచె ;
అటువిడిచిన వ్రాలునావింటి క్రిందఁ
బటుసహస్రములీల్లెఁ బ్రజలుసందడిని.