పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

364

ద్విపద భారతము


మరలి యేతెంచియు మఱియుఁ గౌశికుఁడు
తరమిడి యత్యుగ్రతపముననుండె,
అంతఁ గల్మషపాదుఁడను రాజవరుఁడు
వింతగా హయమెక్కి వెడలెడుచోట
శక్తిశంభుఁడు వశిష్టాగ్రసుతుండు
శక్తి సంయమి త్రోవఁజన నెదురైనఁ,

శక్తిమహాముని కల్మాషపాదుని శపించుట



జూచియిట్లనియె నాక్షోణివల్లభుఁడు :
నే చనుమార్గంబు విడిచిపో విప్ర!"
అనవిని యాశక్తి యవనీశుఁ బలికె  :
మనుజేశ, ధర్మంబు మఱచి పల్కెదవు;
"రాజవునీవు; నే బ్రాహ్మణోత్తముఁడ;
నోజ నేఁదొలఁగంగ యోగ్యమానీకు!"
అనిన రాజిట్లను నలుక దీపింప :
“నినుఁజూచి పలుకుము; నియమంబులేల!
తొలగు; మూరక నీవు దొసఁగులుమాను;
తొలఁగికుండితివేని తొలఁగింతునిపుడు."
అనిన సంయమిపల్కు: "నవనీశ, నీదు
మనసువచ్చినయట్లు మర్దించునన్ను;
ధర్మమార్గంబు నేఁదప్ప; దప్పినను
ధర్మంబులన్నియుఁ దప్పుఁగావునను."
అనిపల్క రాజన్యుఁ డలిగి యమ్మౌనిఁ
దనచేతిగశకోలఁ దప్పకవేసె.
వేసిన నాశక్తి వికృతుఁడై పలికె:
'వాసి యించుక లేక వసుధీశ, నన్ను
దఱటున నేయంగ ధర్మమే నీకు!
వెఱపు విప్రులయెడ విడిచితి; గానఁ,