పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

357


జతురతఁబోయి యాజలజబాంధవుని
శ్రుతులచే నెంతయు స్తుతియింప, నతఁడు
మనమునహర్షించి మౌనికిట్లనియె:
"అనఘాత్మ, యేమైన నడుగు మిచ్చెదను;
బ్రహ్మవేత్తవు నీవు బ్రహ్మపూజ్యుఁడవు
బ్రహ్మసంభవుఁడవు ప్రణుతింపవలదు."
అనిన వశిష్ఠుండు హరిదశ్వుఁబలికె:
"వనజాప్త, యిపుడు సంవరణభూపతికి
నీకూఁతుఁ దపతిని నెమ్మినీవలయు
బ్రాకట నిఖిల సౌభాగ్యవర్తనల;
వనితలఁగన్నట్టి నారల ల్ల
ఘనవరునకు నీయఁ గాంచుటే ఫలము."
అనిన సంతోషించి యంభోజసఖుఁడు
తనకూతుఁ దపతినిఁ దాల్మిరావించి,
దివ్యభూషణములు దివ్యవస్త్రములు
నవ్యంబుగానిచ్చి నయములునొడివి,
భూవరునకుఁ బెక్కుభూషల నొసగి
యావశిష్ఠుని వెంట ననిచిపుత్తెంచె.
ఆరీతి నమ్మౌని యర్కసంభవను
గారవంబునఁదెచ్చి కడుసంభ్రమమున
వరముహుర్తమున సంవరణభూపతికి
సరిఁబెండ్లిసేయ, నాజననాథుఁడలరి
మునిశిఖామణికిఁ గేల్మొగిచి వీడ్కొలిపి,
యనుభవవాంఛ నయ్యవని రాజ్యమున
మంత్రలఁబూన్చి, యమ్మగువయుఁదాను
యంత్రితమదనరాజ్యానుభోగంబు
వరుసఁ బన్నెండేండ్లు వారక సేయ
ధరణి నధర్మంబుతగులుటఁ జేసి