పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

348

ద్విపద భారతము


వానిఁ దృణప్రాయవచనుఁగాఁజేసి.
పూనికనార్వురుఁ బొదివిప్పకపుడు
వారిపై నడవంగ, వనితలున్నెడకు
వారురాఁగనుఁగొని వాఁడాగ్రహించి,
బాణవర్షము పార్థుపైఁ బ్రయోగింప,
బాణారిమఱఁది యబ్బాణంబులెల్లఁ
బిడుగుచే వర్షించుబిందువుల్ వోలెఁ
గడకొఱవిని నేర్పుగదురఁ ద్రుంపుచును,
సవ్యకరంబున జంగఱాలెత్తి
దివ్యుపైవైచుచోఁ, దెమలక వాఁడు
బాణధారల నట్టిపాషాణవృష్టి
రేణువుల్చేసి యార్చిన, నింద్రసుతుఁడు
మిడుఁగుర్లు గంధర్వుమీదబెట్టురలఁ
గడువడి నయ్యగ్నికాష్ఠంబు ద్రిప్పి
పలికె: "నీవొకతేరుపై విల్లుగలిగి
యలుగులేయుచు మమ్ము ననదలఁ జేసి
యెత్తివచ్చెదవింకనోరి! యీ కొఱవి
క్రొత్తగా వైచెదఁ గుందకనిలువు. "
మనివైవ నాభీల హాలాహలాగ్ని
జనిత కోలాహలసరణి నయ్యగ్ని
నిప్పులంజడిగాఁగ నిగిడె బెట్టుగను.
అప్పుడు పైచీరలంతంతఁగమరి
కొన[1]మీసములుగాలుగొని శరీరంబు
నొనరఁబొక్కిన, నింతులోలిపొక్కంగ,
నమరులాకలకలం బాలించి మింట
సమరసన్నద్ధులై సైనికోత్తములు
పతికినడ్డమువచ్చి పార్థుపైఁగినిసి
యతిఘోరశరవృష్టి నందంద ముంప,

  1. వాస (మూ )