పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

343


పోదము; పాంచాలభూములలోని
భూదేవు లతిథులఁ బూజింతురట్టె!
చూతము పాంచాలసుతవివాహంబు;
నేతెఱంగున బ్రహ్మ యెన్నుచున్నాఁడొ!
యారూఢి." ననఁగ నయ్యవనీసురుండు
నూరికేఁగె గృహస్థునొప్పవీడ్కొనుచు.
అంత సూర్యోదయంబైనఁ, బాండవుఁడు
శాంతితో సంధ్యాదిచర్యలు దీర్చి
కువలయామరకోటికొలువున్నయట్టి
ధవళవేదికిఁబోయి, తమ్ములుఁ దాను
నామముల్ నొడిపి ప్రణామముల్ చేసి
యామహాత్ములు తమ్మునాశీర్వదింప
వినతుఁడై యున్నచో, విప్రులఁజూచి
జననికుంతియుఁ గరాబ్జమ్ములు మొగిచి:

పాండవు లేకచక్రపురము విడుచుట


"ఉత్తమోత్తములార, యొకచోటమాకు
నిత్తెఱంగుననిల్వ నెఱయదునీతి;
పుణ్యదేశములకుఁబోయి మీవంటి
పుణ్యులఁబొడగాంచి పుత్తుముదినము;
దేశాంతరులకిదిదీక్షగా." దనిన
నాశాంతులిట్లని రాకుంతితోడ :
"ఒండు దేశములేల! యుత్తమసాధ్వి,
నిండ నిన్నియు మీరునిలిపినయిండ్లు;
ఈయమునాస్నాన, మీయనుష్ఠాన,
మీయగ్నిహోత్రంబు లేసీమఁగలవు!
దేవమూర్తుల మిమ్ము దృష్టించుభాగ్య
మేవెంట మఱువలేమే" మన్నఁగొంతి;