పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

338

ద్విపద భారతము


చెప్పుఁడా." యనుటయుఁ జెలువనీక్షించి
యప్పుడా విప్రుఁడిట్లని చెప్పఁదొణఁగె :

ద్రౌపదీ ధృష్టద్యుమ్నుల జననము



"భామ, యేదక్షిణపాంచాలభూమి
ధాముఁడఁ; దీర్థయాత్రకు వెడలితిని.
ద్రుపదుఁడచ్చటి రాజు దుష్టమర్దనుఁడు;
విపులధర్మముత్రోవ విడువఁడా రాజు,
అతని రాజ్యంబున నతిథిపూజనము
పతిపత్నులేకమై భక్తిఁ జేయుదురు.
ఆనృపునింట స్వయంవరంబైన
నే నందుఁబోయెద నిప్పుడు మరలి.
ఈక్షింపఁబోయిన యెల్ల విప్రులకు
దక్షిణలిచ్చునాతండనివింటి.”
ననిన:"స్వయంవరం బతనికిఁ జేయఁ
బనియేమి? నాకునేర్పడఁజెప్పు." మనిన,
నారాచకూతున కా విప్రుఁడనియె:
"కారణంబడిగితిఁ గ్రమమొప్పవినుము ;
రామ, ద్రోణుండు భరద్వాజమునికిఁ,
బ్రేమతో ద్రుపదుండు పృషతభూపతికి,
నొక్కట మునిసీమ నుదయించి పెరిగి
మక్కువ నన్యోన్యమైత్రి వాటించి
యున్నచో, ద్రుపదునకుర్విరాజ్యంబు
క్రన్ననఁబూనబో గార్యంబు గలిగె.
గురుని రమ్మనిపిల్వ గురుఁ : డీవు పొమ్ము;
శరవిద్యనేర్చి యచ్చటికి నేవత్తు;
మఱవకు' మనుటయు : 'మఱతునే యేను!
జెఱిసాము నీకు నీక్షితి యిత్తుఁగాక."