పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

335


శకటంబుడిగ్గి యాచమనంబుచేసి,
బకుఁడువచ్చినదాఁకఁ బస లేదుగాన
బండిలోపలికూడు బావుకొనంగ,
మండుచు బకుఁడు గ్రామంబుపై నలిగి :
"యొక్కటఁ దముమ్రింగ నొల్లకయున్న
మిక్కిలిక్రొవ్విరే! మేదినీసురులు;
రారైరిప్రొద్దున; రాకున్న నేమి,
తేరైరి నేనున్న తెరువుకు బండి;
తేకున్న నేమి, నాదృష్టి మార్గమున
నీకుడుగుడువ వీఁడెంతటివాడు!"
అనిపోయి పిడికిట ననిలజుఁ బొడువఁ,
దనుగానివానిచందమున భీముండు
తలఁకక పొణకయంతయు రిత్తచేసి,
జలముల మఱియు నాచమనంబు చేసి,
యుర్వికి వ్రేఁగైన యొకమాను వెఱికి
దుర్వారుఁడై యేసె దుష్టదానవుని.
వాఁడంత నొకమాను వలచేతఁ బూని,
వేడిచూపులఁ బాండవేయుని జూచి:
"మనుజభోజనులైన మాకు నీవెంత!
మనుజకీటమ, నిన్ను మడియించి నేఁడు
ఎడపనియాఁకట నే నిండ్లతోడఁ
గడిచేసి యేకచక్రము మ్రింగువాఁడ
నిలు.” మని యొక మ్రాను నృవునిపై నేయఁ,
బలు దునియలుచేసి పలికె రాక్షసుని:
"ప్రకటించి యసిచూపి బ్రాహ్మలచేత
నొకకాసుమొదలుగా నొల్లరునృపులు ;
అట్టిబ్రాహ్మణుల నేలా! యిల్లువరుసఁ
బొట్టకై చంపితి పుణ్యవిదూర!