పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

333


దానవు నాహవస్థలిఁ జంపివచ్చు;
నేనొండువిధమైన నేటికిఁ బుత్తు!
తొల్లియు దైత్యులఁదునుమాడినట్టి
బల్లిదుం." డని ప్రీతిఁ బవనజుఁజూచి :
“తడయక బకుఁజంపి తనయ, ర;" మ్మనుచుఁ
గొడుకు నియోగించె గుంతివేడుకను,
అంతఁ దమ్ములుఁ దాను యమసూతి వచ్చి,
వింత భీముని యందు వీక్షించి యెఱిఁగి
కుంతికినిట్లనుఁ : - "గుంతి, యిదేమి!
యెంతయుఁదెలిసి నేఁడితఁడున్నవాడు;
కయ్యంబదెక్కడఁ గలిగెనో తనకు?
నియ్యత్న మేమైన నెఱుఁగు దే!" యనినఁ,
గుంతియావిధమెల్లఁ గొడుకుతోఁ జెప్పఁ
జింతించి, యతఁ: "డిట్లు సేయంగఁ దగునా!
విడువవచ్చినయట్టి వీరుండెనీకు !
వడముడి భారతవంశవర్ధనుఁడు.
ఎల్లసంకటములు నితనిచేఁగాదె!
తల్లి, యీవును మేముఁ దప్పి వచ్చితిమి ;
ఇతఁడుగూలిన వైరు లెత్తరె తలలు!
మతిఁ గార్యహేతుపు మఱుచితి." వనినఁ
దల్లి పుత్త్రునిఁజూచి : "ధర్మమె తప్ప!
నెల్లవారలలావు నెఱుఁగవు కొంత.
పావని పుట్టినపదియవనాఁడు
నా వెరవునఁదప్పి యవనిపైఁ బడిన,
నిసుమయ్యె నాగొండ యెల్లరు నెఱుఁగ;
నసురఁజంపఁడె మొన్న నాహిడింబాఖ్యు!
ఆప్రభావమున మహాపుణ్యమనుడు,
విప్రకార్యార్థమై వీనిఁ బొమ్మంటి."