పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

331


నెంతకాలమునకు నే వింతదాన;
నింతమేలొనరించి యే ముక్తి గాంతు;
గురుఁడు శ్రాద్ధముసేయఁ గూఁతున కెక్కు;
గురునకు శ్రాద్ధంబు కూఁతుచేఁగాదు;
గురులార! మీరున్న, గొడుకులుఁ గూఁతు
లిరవొందఁ గల్గెద రిండ్లు నిండంగ."
అనునంత, సెలగోల యల్లార్చి పేర్చి
తన ముద్దుమాటలఁ దనయుఁడిట్లనియె:
"ఎవ్వరుఁబో నేల! యేను నీ చివ్వఁ
ద్రెవ్వనేయుదు నట్టిదీనరాక్షసుని;
నబ్బకదానవుఁ డబ్బక కాక,
యిబ్బాధనొనరింప నెంతటివాఁడు!
ఇదె చన్నుగుడిచి పోయెద." నన్న నవ్వి
మదిశోకమించుక మఱచియున్నంతఁ,
గుంతి బ్రాహ్మణుఁ జేరి: "గుణధామ, మీకు
నింతచిక్కులువడ నేమి కారణము?
చావ నెచ్చోటికిఁ జనవలె మొదల?
ఆవల నెవ్వారికాహారకాంక్ష?
ఎఱిఁగింపు వినియెద; నేభంగినైన
వెఱపుమాన్చెద." నన్న విప్రుఁడిట్లనియె:
"ఏమనిచెప్పుదు నింతి, యిప్పురికి
నామడ యమునామహానది గలదు;
అందు దైత్యుఁడు బకుండనువాఁడు తొల్లి
సందుచేకొని యేకచక్రంబువారి
నొక్కటమ్రింగుచో, నూరి బ్రాహ్మణులు
తక్కక జప హోమ దాన ససత్వమున
నసురేశునిల్పుచు నప్పుడిట్లనిరి:
'పొసఁగ నిందఱమ్రింగి పోనేల నీకు?