పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

330

ద్విపద భారతము


“అక్కట! సంసారమతికష్టమగుట
నిక్క మెఱింగియు నేరుపు లేక
యాలని బిడ్డని యడియాసఁజొచ్చి
తూలుదునే యిట్టిదుఃఖాబ్ధిమునిఁగి!
యీదెసకై తొల్లి యీపల్లెవిడిచి
పోదమురమ్మన్నఁ బొలఁతి రాదయ్యె.
ఒగ్గుగూడిన యగ్నిహోత్రంబు విడిచి,
యగ్గలంబైన దేవార్చన విడిచి,
యతిథిసత్కారంబులన్నియు విడిచి,
మృతి కేఁగవలసెనే మిన్నక తనకు!
పుత్రుండు బాలుఁడు పొమ్మనరాదు;
పుత్రి యల్లునిసొమ్ము పొమ్మనరాదు;
పొలఁతి యుత్తమసాధ్వి పొమ్మనరాదు;
నలువుర మీయింట నాకుఁబోవలసె. "
అనవు డప్పుడుచూచి యంగనపలికె :
"ననుఁబంపు ప్రాణేశ , నరభోజనునకు
నెనగ బిడ్డలఁగంటి నీడేరెమనువు;
అసురచేజత్తు ముత్తైదువచావు.
పతిలేక బ్రదికెడు పడఁతిజీవనము,
కుతలంబుతిట్టు.........................
పడిన మాంసముఁజూచి పక్షులువోలె
వెడదలగాఁ జూచి విటులుగోరుదురు.
కులము విచారించి కూతునీనేరఁ;
జలముతో బాలునిఁ జదివింపనేర ;
నేనుజచ్చిననేమి! యింక వివాహ
మై నీకుఁ బుత్త్రుల నార్జింపవచ్చు."
ననిన నిర్వురఁజూచి యాకూఁతురనియె:
"ననుబంపుమచటికి న్యాయమార్గమున;