పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; షష్ఠాశ్వాసము

327


వేడుకఁబూజించి వినతులై యున్న,
గోడలి మనుమలఁ గూర్చుండఁబనిచి,
యాసీనుఁడై పాండవాగ్రజుఁబలికె:

వ్యాసుఁడు పాండవులకు హితోపదేశము సేయుట


పాసిపొండని మిముఁ బలికెనే నృపుఁడు!
కొడుకుఁ దానును నొక్కకుత్తుకయగుచు.
వెడలివచ్చుట మేలు వెయ్యేల మీకు
వదలక మిముఁ జావువారలఁ జేసి
యుదకంబులను నిచ్చియున్నారువారు.
ఓలిఁగౌరవులకు నుదకంబులిచ్చి,
యేలుదు భూచక్ర మీవు చింతిలకు.
నాలుగుభుజములు నారాయణునకుఁ
బోలెఁ దమ్ములు నీకు భుజబలోన్నతులు.
రాజసూయమహాధ్వ[1]రంబశ్వమేధ
వాజపేయములు భూవర, సేయఁగలవు;
ఇంతనుండియు మిమ్ము నెఱుఁగరాకుండఁ
గొంతకాలము మానిఁ గొలిచి యిందుండి,
యేకచక్రమునకు నేఁగుఁ; డేనంత
నాకడ కేతెంచి యరయుదు మిమ్ము.
కమలలోచన యిది గడుముద్దరాలు;
రమణి రాక్షసియని రాదు వర్ణింప.
తనయు మహాసత్వుఁ దనయంతవాని
గను నిందు భీముఁడు; కౌంతేయ, మఱియు
నొక్కొకయాపద యుదయించువేళ
నక్కుమారుడు మిమ్ము నందఱఁ గాచు.
అనివ్యాసుడేఁగిన, నయ్యాశ్రమమున
మునితోడ బహుశాస్త్రములు చదువుచును

  1. రంబును నశ్వ (మూ)