పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; పంచమాశ్వాసము

303


ఎన్నడు రణములో నీవునా కెదురు
పన్నక బహుబాణపటలియేయుచును
దాటుదో! యదినాకుదక్షిణ." యనిన
వాటంపుభక్తి ! నవ్వాక్యంబునకును
నరుఁడియ్యకొనె; నంత నరునకు బ్రహ్మ
శిరము బ్రహ్మాస్త్రంబుఁ జెప్పెద్రోణుండు.
పతి యంత యువరాజపట్టంబు ధర్మ
సుతునకు విదురభీష్ములు మెచ్చ నిచ్చి,
యనుపమ రాజచిహ్నముల నిచ్చుటయు,
జసులాత్మ నలర నజాతశత్రుండు
కరి కిటి గిరి శేష కచ్ఛపంబులకు
ధరణి భారముమోవఁ దాను దోడగుచు,
న్యాయమార్గంబున నడపి భూజనుల
శ్రీయు సుభిక్షంబుఁ జెందఁ జేయుచును,
నలువురుతమ్ములు నాలుగుదిశలు
బలిమిసాధించి కప్పంబులు చేర,
ధన ధాన్య పశు వాజి దంతులు నగర
మున నాఁటి లెక్కకు ముమ్మరింపంగ,
నానినవేడ్క సేనానిపట్టంబు
పూనినట్టి గుహుండువోలెఁ బెంపొంది,
యేకశాసనముగా నిలయేలునతని
యాకాంతి, యాశాంతి, యామూర్తి చూడఁ
జాలక, శకుని దుశ్శాసనుఁ గర్ణు
నాలోనఁగూర్చి యిట్లనియె రారాజు :
“రాజెఱుంగఁడు; యువరాజ్యంబుధర్మ
రాజునకొసగె నుర్వర హెచ్చువొంద;
మేలునఁ బగవారి మెఱయించుటెల్లఁ
బాలుపోయుటగాదె పాముకూనలకు!