పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; పంచమాశ్వాసము

293


ఇందఱుఁజూడంగ నిపుడుగావలయు;
సందుచేకొనిపోకు చాపహస్తుండ!
ఎదుటనెవ్వఁడులేక యేయుటయొప్పె;
నిదె యింక నన్నేయు మెదిరించినాఁడ."
అనుడు, నర్జునుఁ డాత్మ నతనిఁగైకొనక
మునివ్రేల సాయక ముఖమంటి పలికె:
"పిలువక సరి యిట్లు బిరుదవైవచ్చి
పలికెదు; నీకెట్టిపౌరుషంబందు!
ఎవ్వఁడవని నీకు నిత్తుఁగయ్యంబు!
నివ్వెఱఁగయ్యెడు నీగర్వమునకు!
బుధుఁడైన గర్వంబుఁ బొరయఁడువిద్య;
నధముండు గర్వించు నల్పవిద్యలను;
పగయును మైత్రియు బంధుకార్యంబుఁ
దగువానితోడఁగదా! సేయవలయు."
ననినఁ గర్ణుఁడు పల్కు: "నస్త్రంబు గలిగి
నినువోలె మెత్తనై నేరముపలుక;
ఘోరాస్త్రజిహ్వఁబల్కుము; మాంసజిహ్వఁ
గూరిమిఁ గొసరినఁ గొనఁడుకర్ణుండు;
ఎవ్వఁడనైతినే నేమి! ర.” మ్మనుచుఁ

కర్ణార్జునుల ద్వంద్వయుద్ధము


గవ్వడిపై మేఘకాండమేయుటయు,
ముడివడ బెడఁగైనమొగిళులనడుమఁ
గొడుకుఁగానక తల్లి కుంతి మూర్ఛిల్లి
త్రెళ్ళిన, విదురుండు దెలిపె; నాలోన
ఝల్లన నామేఘసంఘంబు వివ్వ
వాయుబాణంబేసి, వానిపై నరుఁడు
సాయకంబులు గొన్ని సంధించునంత,