పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

290

ద్విపద భారతము


ముసల కుంత ప్రాస ముద్గర చక్ర (?)
అసి శూల హలముల హవణించువారు,
గ్రక్కున రథ తురంగమ వాహనముల
నెక్కి యుద్ధాటోప మిలఁ జూపువారు,
మఱియుఁ బెక్కనువుల మనుజేంద్రసుతులు
నెఱి విద్యచూపుచో నేలగ్రక్కదలె;
నాదిత్యురుచి మాసె నస్త్రదీధితుల;
భేదిల్లె దిశలు గంభీర[1]నాదముల.
అప్పుడు తమలోనియాగ్రహాటోప
ముప్పొంగి భీమదుర్యోధనుల్ గదిసి,
యొక్కటగదలెత్తి యురుచారురూఢి
నక్కనకాద్రివింధ్యములునా నొప్పి,
లోఁగకవ్రేసి, వ్రేటులుదప్పఁ గ్రుంగి,
వీఁగియుఁ గడిమిమై వెండియుఁగదిసి,
యుర్విపై గదలూది యొండొరుఁజూచి,
పూర్వసీమలుమాని పూపుమైఁజొచ్చి,
వ్రేటు వ్రేటునకంటె వ్రేఁకగావ్రేయ
వ్రేటుకందువులకు వేవేగఁ దొలఁగి,
గదలు వేమొగమునఁ గదియఁద్రిప్పియును,
అదియొందలేక వ్రేయక లాసిలాసి,
యాయస్త్రఘట్టన లగ్నులనీన
మాయపుఁద్రొక్కులు మహిఁగదలింప
నీసునఁబెనఁగుచో, నెఱిఁగి పట్టించి
యాసమయంబున నాచార్యుఁడనియె:

అర్జును నస్త్రవిద్యాకౌశలము



“ఇంక నా ప్రియశిష్యుఁ డింద్రనందనునిఁ
గొంకకచూడుఁడీ కోదండమునను!

  1. నాసముల. (మూ )