పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; పంచమాశ్వాసము

289


నుర్వీశ్వరునిఁ దోడియోధులఁ బలికె :
"సర్వజ్ఞులందఱు సభఁగూడినారు;
వింటికి హరియొండె విశ్వేశుఁడొండె
దొంటిరాఘవుఁడొండె దుర్గతానొండె
నేతున్; రొండొకనికి నేర్తువనరాదు ;
బ్రాతిగా నట్లయ్యుఁ, బతి యాదరమునఁ
గురుకుమారకులకుఁ గొంత చెప్పితిని;
బరికింపు." డని చెప్పి పాయయిచ్చినను,
ఆచార్యులకుమ్రొక్కి యాకుమారకులు
వే చాపములుపూని వేడ్క మ్రోయించి
కనుచూపు మేరలక్ష్యము లేయువారుఁ,
గనరానిసూక్ష్మలక్ష్యము లేయువారు,
వెనుక ముందఱ నొక్క విధములక్ష్యములు
గనుఁగొని తునియ నొక్కట నేయువారుఁ,
దునిసి లక్ష్యంబు తోఁదొఱగుచోఁ దునుక
గనుఁగొని చూర్ణంబుగా నేయువారు,
ధరకమ్ము [1]నాడికాత్రయమునఁ గాని
తిరిగిరాకుండ నద్దివినేయునారు,
తగ్గక శరము పాతాళలోకంబు
డగ్గఱ ధరణిగాఁడఁగ నేయువారు,
గుఱిగొని తీగలాగునఁ బింౙపింౙ
గఱవఁ గోలలు నిడుపుగా నేయువారు,
నలుగుననొకట నైదారులక్ష్యములు
బలిమి నొక్కటఁ ద్రెవ్వఁబడ నేయువారు,
నొండొరుదలపడియుద్ధంబు సేయు
పాండిత్య మెంతయుఁ బ్రకటించువారు,

  1. నాడిగా (మూ)