పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

274

ద్విపద భారతము


ఆపని నాచేతనగు; నైననేమి,
యోపిక మీకు నెట్లో చూత!" మనిన,
ధరణీశతనయులు తలలెత్త వెఱచి
గురునితో నొక్కపల్కునుబల్క వెఱచి
యొండరుమొగము లొండొండ చూచుచును
నిండారునిశ్చేష్ట నివ్వెఱఁగంది
యున్నచో, 'మీకోర్కి యొనరింతు ననుచు'
గ్రన్ననఁ బలికె నాఖండలాత్మజుఁడు.
అప్పుడర్జునుమెచ్చి, యతఁడు వారలకుఁ
జెప్పంగఁదొడఁగె నూర్జితచాపవిద్య,
చెలంగుకుమారుల శింజినీధ్వనులఁ
గలఁగెవారాసులు; కంపించెగిరులు;
పదఘట్టనల భూమి పగిలినట్లయ్యెఁ ;
జెదరె దిగ్గజములు సింహనాదముల.
గురుఁడంత నీరీతి గురుకుమారులకు
జిరగతి విలువిద్య చెప్పుచునుండ,

ఏకలవ్యుని ధనుర్విద్యాభ్యాసము


నడరి హిరణ్యధన్వనుచెంచురాజు
కొడు కేకలవ్యుండు కోర్కిదీపింప
నాకుమారులతోడ నతులితభక్తి
నాకడకేతెంచి, యరయంగ నపుడు
కలశజుఁగాంచి నిక్కపుభక్తిమ్రొక్కి
చెలుపొర నగ్గురుఁ జేరి యిట్లనియె:
"నీవేమికోరిన, నీకోరినట్లు
వేవేగ వొసగెద విలువిద్యఁ జెప్పు".