పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము

245


పనిగొన నఱలేనిభక్తి దీపింప
నొనరంగ వచ్చుచునున్నారు వారె.
ఈదివ్యపురుషుల నిటు గన్నకుంతి
యేదైవములకన్న నెక్కుడై మించి,
యల్లదె వచ్చుచు నట మనమీఁదఁ
జల్లనిచూపులు చల్లుచున్నదియు;
దేవమూర్తుల వారి దృష్టింత." మనుచు
వేవేగ నెదురేఁగి వీక్షించువారు,
నేవీథి వత్తురో యెఱుఁగరా దనుచు
నావీథి కావీథి కరిగెడివారు,
'రాజమార్గంబున రాఁబోవరాదు;
వాజులు రథములు వారణంబులును
సందడించెడు. ' నని సౌధంబు లెక్కి
కందర్పమూర్తులఁ గనుఁగొనువారుఁ,
జల్లగాఁ గస్తూరి జాజులుఁ గలిపి
చల్లెడువారునై సంభ్రమింపఁగను,
విదురుని భీష్మాదివృద్ధుల సతుల
నెదురుగాఁ బుత్తించి, యిభపురాధిపుఁడు
ఆడువారలు మోచు నందలం బెక్కి
పోఁడిగాఁ గుంతిఁ బూఁబోఁడి రాఁబనిచి,
పెద్దకొల్వున నుండి బిడ్డలరాక
తద్దయుఁ గోరుచోఁ, దాపసోత్తములు
పార్థులఁ దెచ్చి భూపతికి మ్రొక్కించి,
యర్థి నంతఃపురి కాకుంతిఁ బనిచి,
జగదీశుచేతఁ బూజలు వారు వడసి
తగినపీఠకములఁ [1]దమయంత నుండి:

  1. తరువాత (మూ )