పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము.

229


         అర్జునుజననము
"సత్యశౌర్యుఁడు నీకు జనియించుఁగొడుకు;
ఎంతటివానిఁగా నీవు చింతించి
తంతటిగుణవంతు నతిరథశ్రేష్ఠు
నిచ్చితి." నని చెప్పి యింద్రుండు పోవ,
నచ్చట వ్రతము సమాప్తమై కుంతి
పతియాజ్ఞఁ దలమోచి, పస భక్తియుక్తి
హితమతి వేఱొండు నిచ్చలోలేక
మునియిచ్చుమంత్ర మిమ్ము లనుష్ఠించి,
తనమదిలోనున్న తాత్పర్య మెసగ
నమరేంద్రుఁ దలఁచిన, నారాత్రి వచ్చి
కమలాక్షికోరిక కరుణించి, యపుడు
వరదుఁడై పాండుభూవరుకూర్మిసతికి
వరపుత్త్రదానంబు వలనొప్ప నిచ్చి
పోయిన, నొకయేఁడు పూఁబోఁడి గర్భ
మాయతమతిఁ దాల్చి, యట యొక్కనాఁడు
ఉత్తరఫల్గుని నుడురాజు మెఱయఁ,
జిత్తరాగము సర్వజీవులఁ బొరయ,
విక్రమక్రమకళాన్వితసముద్భవుని
శక్రువంశంబున జగమెల్లఁ బొగడ,
జలజాక్షు రాముఁ గౌశల్య గన్నట్లు
కులదీపకునిఁ గాంచెఁ గొడుకు నుత్తముని.
అప్పుడు భాషించె నాకాశవాణి:
"యిప్పాండవుఁడు ధీరుఁ డింద్రసన్నిభుఁడు;
కార్తవీర్యార్జునుగతి నాజిలోన
మార్తుఱఁదెగటార్చు మహితాత్ముఁడగుట
నర్జుననామధేయంబున నమరి
నిర్జరాధిపునైన నిర్జించు నాజి :