పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆది పర్వము ; తృతీయాశ్వాసము.

165


అని వశిష్ఠుఁడు మమ్ము ననుపుటఁ జేసి
జయింపవలసె నీజగతిలోపలను.
నీయందు మునిఁగిన, నెఱయఁజేరినను,
బాయంగనగు సర్వసాపంబులండ్రు;
ఒక్క నిఁ దనయుఁగా నుండని ”. మ్మనుచు
మ్రొక్కి యావసువు లమ్ముదితకిట్లనిరి:
"ఇలదీర్ఘజీవిగా, నేము మాలోనఁ
బొలఁతి, చతుర్థాంశములు పుచ్చి నచ్చి
కలసియిత్తుము పుత్త్రుఁగా నీకు; నతఁడు
నిలిచివర్థిల్లెఁడు నృపుఁడు మోదింప”.

గంగాశంతనుల సమయము

అనిన నట్టిదకాకయని వారినెల్ల
ననిచి, భాగీరథి యటవచ్చివచ్చి
వసుధీశునెమ్మేను, వక్షస్‌స్థలంబుఁ,
బసనిదీప్తులు, ముఖపం కేరుహంబు,
నాజానుబాహులు, నసమానరుచియు,
రాజీవ రుచిర నేత్రంబులుఁ జూచి,
యీశానుతలకెక్కి యేలినగంగ
యాశంతనునిమూర్తి కాత్మలో మెచ్చి,
గరువంబునేరక కదిసిపోలేక
సురిగిరానేరక సుడిపడియున్నఁ,
బతియును దానిసౌభాగ్యసంపదకు
మతిలోనఁజొక్కి., మన్మథునకుఁజిక్కి :
“దైవకన్యకయొ ! గంధర్వకన్యకయొ!
యీవచ్చుకన్య దేవేంద్రకన్యకయొ !
వరకన్యకయొ ! కాక, వసుమతినంత
నరకన్యకకు నిట్టినయరూపు గలదె!