పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; తృతీయాశ్వాసము.

163


జూచిన, నింద్రుండు క్షోణీశుఁ గినిసి
'భూచక్రమునఁ బోయిపుట్టు నీ' వనుచు
శాపించుటయు, నొండుజనులకుఁ బుట్ట
నోపక యారాజు యుక్తమార్గమున
ననుపమకులదీపుఁడగు ప్రతీపునకు
జనియించె ధర నిట్లు శంతనుండనఁగ.
శృంగారరసమెల్ల క్షితినితండైన
నంగజునకుఁ బుట్ట ననువు లే దబల!
ఎన్నఁగా నాఁడు నీ వీరాజుమీఁదఁ
గన్ను వేసితి; గానఁ, గడు వేడ్క పుట్టి
కాంతవై నీవిదే కవయఁబోయెదవు.
వింతవారముగాము వినుము మాకథయు;
నేడులోకంబుల నెదురెందులేక
వేడుక విహరించి, వెసలోకమునకుఁ
బొసఁగ భార్యలు మేముఁ బోవుచుండంగఁ,
బసఁగ మే మేఁగునప్పథమధ్యమునకుఁ
జేరువనున్న వశిష్ఠాశ్రమమునఁ
గోరి సుఖింపంగఁ, గొంతసేపునకు
నందఱమును డిగ్గ, నచ్చోటనుండె
నందిని యనునావు నయన రమ్యాంగి;
ఎట్టికోరిక లెవ్వ రిచ్చలోఁ దలఁచి
రట్టికోరికలిచ్చు నంతటిసొమ్ము.
[1]మేయఁబోవఁగ దాని మేనిరోమముల
చాయకు వెఱఁగంది సంప్రీతి నపుడు
ఆర్యాణియనునది యష్టమవసువు
భార్య యాధేనువుఁ బట్టి తెమ్మనుచు
మగనిఁ బ్రార్థించిన, మానినిమాట
తగదనమైతిమి; తప్పుచేసితిమి.

  1. మెరయ (మూ)