పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; తృతీయాశ్వాసము.

155


బరఁగ నామీద భూభరణబు సెయ
భరతనామకుఁ డనఁ బ్రజలు వీఁ " డనుచు
నామధేమంబును నలువొప్ప బెట్టి,
ప్రేమతోఁ బెనువంగ, బెరిగి యాసుతుఁడు
సింగంపుఁగొదమల సిగపట్టితిగిచి,
భంగించి యావలఁబాఱంగఁ దోలు ;
నెలుగుపిల్లలఁ దెచ్చి యింటిబాలకుల
నలబూచిబూచని యాడించుచుండు,
నీరీతి మఱియు ననేకలీలలను
వారక నేయుచు వర్తింపుచుండె.

శకుంతలను హస్తినాపురికనుపుట



అంతఁ,గణ్వమునీంద్రుఁ డనుఁగుఁగూఁతునకుఁ
గాంతి రాచూలికిఁ గడు వేడ్కతోడ
దివ్యభూషణములు, దివ్యాంబరములు,
దివ్యగంధంబులు దీపింప నొసగి,
తనశిష్యగణములఁ దగఁ దోడుగూర్చి
యనఘుఁ డల్లునియూరికనిచిపుత్తెంచె.
ఆరీతి మునిపంప, నాశిష్యవరులు
దారకుతోఁగూడఁ దరుణిఁదోడ్కొనుచు
హస్తినాపురమునకరుదెంచి, యధిపు
శన్తంపుమొగసాలఁ జదురొప్పనిలిచి,
దౌవారికులచేతఁ దమరాకతెఱఁగు
భూవరునకుఁ జెప్పిపుత్తేర, నతఁడు
నతిభ క్తితో వారి నటకురావించి,
చతురతఁబూజించి సన్నుతిఁబలి :
" అనఘాత్ములార, మీరరుదెంచుకతన
ఘన తపో ధర్మాత్మ కలితుండనైతి.