పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము-ద్వితీయాశ్వాసము

95


అని చొచ్చిపోయి, దైన్యంబున నతని
కనకమహాపీఠకముఁ జుట్టి యుండె.
ఆవిధంబున సర్పయాగ మానృపతి
గావింప, నాగలోకమున నింటింట
బాలవృద్ధాంగనల్ బలసి వాపోవ,

ఆస్తీకుఁడు సర్పయాగమును వారించుట


నాలించి, యాస్తీకుఁడనుమహామౌని
యనఘ, జరత్కారుఁ డనుమునీంద్రునకు
నెనయ జరత్కారు వనునాగసతికి
జనియించినట్టి యాసంబంధమునను
వినయంబుతో సర్పవితతి ప్రార్థింప,
మాతృవంశమువారి మరణభయంబు
నే తెఱంగున నైన నే మాన్తు ననుచుఁ,
జలకాకపక్షులసంయమివరుఁడు
చెలులును శిష్యులు సేవింపఁ గదలి,
జనమేజయునియాగశాలకుఁ బోయి,
వినయసంపూర్ణుడై, వేగిరపడక,
మునుల నానాతంత్రములనున్న వారి
గొనియాడి, తజ్ఞులఁ గోరి కీర్తించి,
పాత్రంబులొడ్డినఫణితి నుతించి,
ధాత్రీశు నియతచిత్తమునకు నలరి,
మఱియుఁ బదార్థసామగ్రి నుతించి,
నలిఁ దొంటిక్రతువులనన్ని పోనాడి
మెచ్చించుటయుఁ, బల్కె మేదినీనాథుఁ:
"డిచ్చెద నీకోర్కి యేమైన నడుగు;
నిక్క; మెవ్వఁడవయ్య! నీ దేహకాంతి
పిక్కటెల్లఁగఁజొచ్చెఁ బృథివి నెల్లెడల.