పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము-ద్వితీయాశ్వాసము

91


కడఁ దల్లి నునిచి, యాకశ్యపబ్రహ్మ
కడకేగి యతనికి గడుభక్తి మొక్కి,
వలనొప్పఁ దనపోయివచ్చిన తెఱఁగు
తెలియంగ వినిపించి దీవనలంది,
కమలాక్షుకృపఁ ద్రిజగంబులయందు
విమలవిఖ్యాతిచే వెలయుచునుండె.
గరుడని విజయంబు కడుభక్తి విన్న
నరులకు ఘనప్రసన్నత మహిమ లలరు,
బహుళతీర్థస్నానఫలము, గోదాన
మహనీయఫలమును, మహితభూదాన
ఫలముఁ, గన్యాదానఫలమును గలుగు;
వెలయుదు రాపూర్ణవిభవసంపదల.
నటుగాన జనమేజయక్షమారమణ,
పటుతరభక్తిసంపదతోడ వినుము.
కావక శాపాగ్ని కలుగుపన్నగుల
దేవతాద్రోహులఁ దీర్పవే దేవ!
ఈరీతి క్రతువు మున్నెఱిఁగియెకాదె
చేరిరి హరి నీశు శేషవాసుకులు!
ఒకఁడు వంశము పెంచు; నొకఁడు హరించు;
నకట! తక్షకుచేత నణగునీకులము.

సర్పయాగసంకల్పము



అనినఁ, గోపాటోప మాత్మ రెట్టింప
జనకునిఁ దలచి, తక్షకుకీడు దలఁచి,
జనులెల్ల వలదని చాటిన వినక,
జనమేజయుఁడు సేయ సర్పయాగమ్ము
నారీతిఁ గోరి, యుదంకు వీడ్కొలిపి,
దారుణయజ్ఞంబు దగఁ జేయఁ దలఁచి,