పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

ద్విపద భారతము


గాదు; మీపలు కమోఘము గానఁ, బిదప
నాదినాకాధిపు నమరత్వ ముడుగు;
నదిగానఁ గరుణింపు" డన మహామునులు
ముదమంది నీకు నిమ్ములఁ గరుణించి,
యాపుత్రకామేష్టియందు జన్మించు
నాపుత్త్రకుఁ బతంగాధ్యక్షుఁ జేసి.
రట్టి యామునుల మాహాత్మ్యంబువలనఁ
బుట్టిన తార్క్ష్యుఁ డిప్పుడు వచ్చుకతనఁ
బూని మహోత్పాతములు పుట్టె" ననిన
నానిర్జరాధీశుఁ డమృతరక్షకులఁ
దగఁ బిల్చి:"కడుఁబ్రయత్నమున మీరెల్ల
ఖగపతి యమృతంబు గైకొనకుండ
రక్షించుకొని, లావు ప్రకటించి బిలిచి,
పక్షి నాహవమునఁ బఱపుఁ డీక్షణమ."

గరుడఁ డమృతరక్షకులతో యుద్ధ మొనర్చుట



యనవుండు నట్లకా కనుచు వారేఁగి,
మును నిశితాయుధంబులు పూని రేయుఁ
బవలును నమృతంబు పటుభంగిఁ గావఁ,
బవమానవేగుఁడై పక్షీంద్రుఁ డపుడు
బెడిదంపుమ్రోతలఁ బిడుగునుబోలెఁ
గడఁకమై విష్ణుచక్రంబునుబోలె
ఱెక్కలుగలమహాద్రియుఁబోలె రభస
మెక్కుడై వచ్చెఁ; బక్షీంద్రునిపక్ష
వాతూలగతి రెండువ్రయ్యలు గాఁగ
నాతతలీల మహాభ్రముల్ దునిసి
తునుకలు నలుదెసఁ దూలి పాఱంగ,

వెనుఁబడి ఖేచరవితతి కలంగ,