పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; ప్రథమాశ్వాసము

59


గావున నిది వేళ గాదు; వే మగుడి
పోవుట మేల యీ ప్రొద్దున; కింక
బోదము ర' మ్మని పొలఁతుకఁ గూడ
యాదట నింటికి నరిగె నవ్వినత.
అంతలో సూర్యుండు నస్తాద్రి కరుగ,
సంతసంబును దక్కి, జలజసంఘంబు,
తమవల్లభుఁడు లేమిఁ దలఁచి, యుల్లమున
[1]రమణేది కందినక్రమము దీపింప,
మూగినషట్పదంబులు లోనఁ జిక్క
నాఁగుచు ముకుళించె నమరఁజిత్రముగ;
తమమీఁదఁ జంద్రుఁడు దాడివచ్చుటయుఁ,
దమసామరారి యుద్ధము సేయఁ దివిఱి
వాఁడిముల్కులతోడ వరబాణసమితి
పోఁడిగాఁగూర్చిన పొలుపుదీపింప.
'పగలెల్లఁదిరిగి మాపటి కస్తశిఖరిఁ
దగఁ బ్రవేశించె బతంగుఁడు; మనము
నతని పేరిటివార; మటుగాన, దిరుగ
మతముగా;' దని గూండ్ల మఱి పక్షు లడఁగె
'కద్రువ కిష్టంబుగా వాలదీప్తి
ముద్రించి నాపెంపు మునుమిడి చూపి,
వినత నోడించెద వేవేగఁ బోయి'
అనివ చ్చెనో యన, నంధకారంబు
కడుదట్టమై యిర్లు గదిసి యేతెంచె.
'తడయక ద్విజరాజు తగఁ బూర్వశైల
శృంగసింహాసనస్థితుఁడగు' ననుచుఁ
..........................................

  1. గ్రమమేది (చూ)