పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

ద్విపద భారతము


నత్తఱి సురలు నయ్యసురులుఁ గదిసి,
క్రొత్తగాఁ బరిరంభకుశలప్రసంగ
వందనప్రియవచోవ్యాపారలీలఁ
గ్రందుగాఁ జెలఁగి యుత్కటహర్షులైరి.
అప్పుడు హరియు, బ్రహ్మయు, సురాసురులు
నొప్పగా మంథాద్రియొద్దకు నడచి.

స ము ద్ర మ థ న ము



రయ్యెడ విష్ణుండు నాంబుజాసనుఁడుఁ
జయ్యన నమ్మహాచలము భేదించి,
శేషు ననుగ్రహించిన నాతఁ డలరి,
భీషణతరమైన పృథివీధరంబు
నతిసత్వయుత దీర్ఘమైన పుచ్ఛమున
వితతంబుగాఁ బెల్లువేష్టించి పట్టి,
పెకలించె; నప్పుడు ఫెళఫెళధ్వనుల
సకలజగంబులుఁ జలియించి చెదరె.
నప్పర్వతముపాఁతునందుఁ గన్పట్టి
తప్పక సప్తపాతాళంబు దోచె.
ఆరీతి శేషుఁ డయ్యచల మెత్తుటయు,
నారూఢి దివిజులు నసురులుఁ గూడి
తడయక దాల్చుసత్వము గానకున్న
యెడ, వారిజవసత్వమెల్లఁ దూలుటయు,
వారల కపుడు సత్వంబును జవము
నారాయణుండు సన్మతిఁ గృపసేయఁ,
బొలిచి వా రతిరయంబున నద్రిఁదెచ్చి
జలనిధిలోన భీషణభంగి వైవ,
గుభులుగుభుల్లను ఘోషంబుతోడ

రభసంబుమై శిఖరంబుల వ్రేళ్ల