పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

41


నుభయవాదులముఁ గూడుండిన, మనకుఁ
ద్రిభువనంబుల నెదిరింపంగఁగలరె!
యొనరంగ మనమెల్ల నొక్కటై దివిజ
దనుజ భటాలిచేఁ దడయక యిపుడు
తోయధి మథియింప దొఱకును నమృత ;
మాయమృతముఁ ద్రావునంతనె మనము
చావును, దెవులును, జరయును, నెవ్వి
భావింపగా రాక భాసిల్లఁగలము.
మాయెగ్గులేమియు మదిలోన నిడక
యీయెడ మీరెల్ల నీ కార్యమునకు
..............................
...............................
కించిత్తు మేలును గీడును లేదు!
పంచుక యనుభవింపఁగఁ గీర్తిగలుగు.'
నని చెప్పి పుత్తించె; నదియునుఁగాక ,
యెనయంగ మీరెల్ల నేకరూపమున
వినుఁడు నామాట; యీవిధమున నడువ
ననుకూలమైనచ్చు నన్నికార్యములు."
నని, వారుపల్కినయందులకెల్ల
మొనసి ప్రత్యుత్తరంబులు చెప్పి తీర్చి,
యొడఁబర్చు నావేల్పుటొజ్జలపల్కు
కడునిశ్చయించి, 'యౌఁగాక' ని, యపుడు
బహుదైత్యదానవపటలితోఁ గూడి,
మహి పెల్లగిల్ల నమర్త్యారివరులు
నడిచిరి తమకు మున్ననువొందుచోటు
పొడగాన క; ట్ల పో భువనంబులోన!
ఈరీతి నాదానవేంద్రులసేన

దారుణగతి నబ్ధితటమున కరుగ,