పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -1


అనవుడు విని భీముఁ డాధర్మజునకుఁ
దనవర్తనము లెల్లఁ దగఁ జెప్పఁ దొడఁగె:
"వంటలవాఁడ నై వసుధేశునగర
వంటలు రుచులుగా వండి పెట్టుదును.
ఎట్టివృక్షము నైన నిరుగేల విఱుతు,
కట్టకై వెదకను గత్తికై వెదక.
వెలయ వండెడువాఁడు వే ఱొక్కఁ డున్నఁ
జెలు వొప్ప వానితోఁ జెలిమి చేసెదను.
మఱియు భూపతివద్దిమల్లవర్గముల
విఱిచి యొడ్డుదు బాహువీర్యంబు మెఱసి.
హరితోడఁ బులితోడ హస్తీంద్రుతోడ
ధరణీశుండును దెచ్చి తలపెట్టెనేని
పట్టి చల్లార్పఁగ బలిమి నుక్కణఁగఁ
బట్టుదు వాని నేఁ బ్రాణంబుఁ గాచి.
వలలుండ నని చెప్పి వసుమతీ నాథు
తలఁపులోపల వత్తుఁ దమకంబుతోడ.
జనపతి నన్ను నే చ్చటివాఁడ పనిన
వినుతిఁ బాండవులతో విహరింతు నందు.
ఇది వర్తనంబుగా నే నుండుచోటు
పెదకి కానఁగ లేరు విపుల శాత్రవులు"