పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని మేల్కాంచి పరమానందహృదయారవిందుండనై యేతత్ప్రబంధ
బంధురవ్యాజకావ్యాలాపకృతక్షణవీక్షణప్రసంగసంగ్రహనిర్వహణ
కృత్యంబున నత్యంతకృతావసరుండనైన తలంపున.

24


క.

శ్రుతుల కసాధ్యుఁడు వెంకట
పతి నాకావ్యమున కాసబడుటల్ దెలిసెన్
క్షితిసుతుని దొట్రుపల్కుల
కతిమోదము దాల్చు తండ్రియందంబయ్యెన్.

25


క.

అనవుఁడు భళి నాకబ్బం
బునకున్ నేఁ డబ్బె తావి పుత్తడికిం గ
ల్గినఠీవి ననుచు మదిలో
నను సంతసమంది కూర్మి నన లొత్తంగన్.

26


చ.

తెనుఁగున గొన్నిగావ్యములు దెల్లముగా రచియింపవచ్చుఁ బే
ర్కొనఁగ నిరోష్ఠ్యకావ్యములుఁ గొన్ని యొనర్పగ వచ్చుఁ గాక చ
క్కన నివిరెండుచందములు గ్రచ్చఱ గూఱిచి నేర్పుచేత నె
వ్వనికి రచింప శక్యమగు వాంఛ యొనర్చితి దాని సేయఁగన్.

27


గీ.

చెప్పరానట్టి కావ్యంబుఁ జెప్పబూని
నాడ, నుద్ధతగతిచేత నడచి నడవ
ములు విచారింపకయె యేఁగు జలధి దాట
చేరి సాహసిదొడ్డు కొంచెంబు లగునె.

28


క.

తొలుతటిసుకవులు ఘనులై
యిల నాంధ్రనిరోష్ఠ్యకావ్య మేలా సేయం
దలచరొ! నాకు బ్రసిద్ధము
గలుఁగఁగ నొనరించుకొఱకు గావలె నరయన్.

29


ఆ.

ఒకరితెరువు వోవ నొకరు నాతెరువు రా
రీప్రబంధరచన నెన్నవశమె!
వెలయ దీనిమహిమ విన్నవారలె కవుల్
గారె! విననివారు కవులు గారె.

30