పుట:తెలుగు వాక్యం.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంశ్లిష్ట వాక్యాలు

29


(67)

సుజాత తిరస్కరించి అవమానించబడింది.

ఈ వాక్యానికి రెండర్థాలున్నై. ఒక అర్థంలో ఇది (65) (66) వాక్యాలకు సమానం. అంటే సుజాత రెండు క్రియలకు గుప్తనిర్మాణ కర్మగానే వ్యవహరిస్తుంది. రెండో అర్థంలో సుజాత ఎవర్నో తిరస్కరించిందని, ఆ 'ఎవరో' సుజాతని అవమానించారని భావం. అంటే క్త్వార్థకక్రియకు కర్త అనీ, ప్రధాన క్రియకు కర్మ అనీ తెలుస్తుంది. వాక్యంలో క్త్వార్థకక్రియ, ప్రధానక్రియ సన్నిహితంగా ఉన్నప్పుడే ఈ విధంగా రెండర్థాలు వస్తై. రెండు క్రియలూ వ్యవహితమైనప్పు డిట్లా రెండర్థాలు రావు.

(68)

సుజాత తిరస్కరించి ఘోరంగా అవమానించ బడింది.

ఈ వాక్యానికి రెండర్థాలు రావు, సుజాతా క్త్వార్థక క్రియకు కర్త. ప్రధాన క్రియకు కర్మ.

క్త్వార్థక క్రియ ప్రధాన క్రియకన్నా ముందు జరిగే వ్యాపారాన్ని సూచిస్తుంది.. అందువల్ల ఈ వాక్యాలు 'తరవాత' అనే పదం ఉన్న వాక్యాలతో సమనార్థ కాలవుతై.

(69)

a. సుజాత ఆన్నం తిని నిద్రపోయింది.
b.. సుజాత అన్నం తిని, తరవాత నిద్రపోయింది.
C. సుజాత అన్నం తిన్న తరవాత నిద్రపోయింది.

(69)లో సూచించిన మూడు వాక్యాల్లోనూ సుజాత రెండు వ్యాపారాలను నిర్వహించిందనీ, అందులో మొదటిది అన్నం తినటం, రెండోది నిద్రపోవటం అనీ అర్థం.

క్త్వార్థక వాక్యాల్లో ఏకకర్తృక నియమం సరైనదే అయినా కొన్ని విరుద్దమైన ప్రయోగాలు కనిపిస్తున్నై. ఉదాహరణకు :

(70)

గొర్రెల్ని తినేవాడు పోయి బర్రెల్ని తినేవాడు వచ్చాడు.

భిన్నకర్తృకమైన ఈ పైవాక్యం వ్యాకరణ సమ్మతమే. ఈ పైవాక్యం ఒక తెలుగు సామెత. కాని ఇట్లాంటి ప్రయోగాలు కేవలం సామెతల్లోనే సాధ్యమని అనుకోనక్కర్లేదు.

(71)

వాడుపోయి వీడెవ్వడు? వీడు హాయిగా నవ్వడు.