పుట:తెలుగు వాక్యం.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

తెలుగు వాక్యం

3.841 : ఈపైక్యాలను పరిశీలిస్తే అని ఇక్కడ హేత్వర్థంలో ప్రయోగించ బడిందని సులభంగా గ్రహించవచ్చు. అనికి పూర్వమున్న వాక్యాన్ని కారణ వాక్యమని, పరంలోఉన్న వాక్యాన్ని కార్యవాక్యమనీ స్థూలంగా అనుకుందాం. ఈ పై వాక్యాల్లో కొన్ని వ్యాకరణ సమ్మతం కాలేకపోతున్నై. 213 a, b లను పోల్చిచూస్తే కార్యవాక్యంలో మనుష్య వాచకశబ్దం కర్తగా ఉన్నప్పుడే వ్యాకరణ సమ్మత మవుతుందని చెప్పవచ్చు. కార్యవాక్యంలో మనుష్యేతరప్రాణి వాచకశబ్దం ఉన్నా 213 c. వ్యాకరణ సమ్మతంగా కనిపిస్తున్నది. (e) లో ప్రాణి వాచకశబ్దం కార్యవాక్యానికి కర్తగాఉన్నా వ్యాకరణ సమ్మతమయింది. అందువల్ల ఈ మూడింటిని పోల్చిచూస్తే కార్యవాక్యంలో జంగమప్రాణి వాచకశబ్దం కర్తగా ఉండాలని ప్రతిపాదించవచ్చు. (d) లో వాక్యం ఆమోదయోగ్యంగా కనిపించినా వ్యాకరణ సమ్మతంకాదు. రైలుబండికి ప్రాణి వాచకత్వం ఆరోపించటంవల్ల ఈ వాక్యం తయారయింది.

3.842 : ఈ కింది వాక్యాల్లో ప్రాణి వాచక శబ్దాలు కర్తలుగా లేకపోయి నప్పటికీ వ్యాకరణసమ్మతాలే, హేత్వర్థబోధకాలే.

(214)

a. నేను ఆలస్యంగా ఇంటికి వస్తానని మా ఆవిడకి కోపం .
b. ఇంట్లో పని ఎక్కువయిందని మా ఆవిడకి విసుగు.
c. పిల్లలు సరిగ్గా చదువుకోవటం లేదని మా ఆవిడకి దిగులు.

వై వాక్యాల్లో ప్రధాన వాక్యాల ఆఖ్యాంతాలు (Predicates) క్రియలుకావు. కాని వాటిని పడు అనే అనుబంధ క్రియను చేర్చి క్రియలుగా మార్చవచ్చు. ఇట్లా మార్చినప్పుడు కు-బంధంతో ఉన్ననామం ఆ క్రియకు కర్తగా మారుతుంది. కర్తృవిహీన వాక్యాలను కర్తృనహిత వాక్యాలనుంచి నిష్పన్నంచేస్తే ఇంతకుముందు చేసిన సూత్రీకరణ సరిపోతుంది. లేకపోతే గుప్తనిర్మాణంలో కర్తృనుభోక్తృ సంబంధాలున్నప్పుడు ఈ రకమైన హేత్వర్థబోధ జరుగుతుందని చెప్పాలి. ఈ వాక్యాల్లో ఆఖ్యాతాలు మనస్థితిబోధకాలు, వాటిని క్రియలుగా మార్చినపుడు మనః పరిణామ బోధకాలవుతై .

3.843 : మనస్థితి బోధకాఖ్యాతాలున్నపుడల్లా ఇట్లా హేత్వర్థం వస్తుందని చెప్పలేం.