పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

284 తెలుగు భాషా చరిత్ర

శాస్త్రిగారిలాంటి కొందరు ఇదేపని చేశారని గుర్తుకు తెచ్చుకోవలసింది. అయితే ఈ చర్చలు ఏ కొద్దిమందినో ఆకర్షించినందువల్ల కోలహల మేమి జరగలేదు.

9.19. 1965నుంచి వచ్చిన వాదోపవాదాలు పాఠ్యపుస్తకాల శైలి విషయంలో వచ్చాయి. అంతవరకూ పాఠ్యగ్రంథాలన్నీ అర్థగ్రా౦థికమో సరళ గ్రా౦థికమో లాంటి ఏదోఒక రీతిలో ఉంటుండేవి. ఆంధ్రప్రదేశావతరణవల్ల తెలుగు నేర్చుకోవాల్సిన వారు రెండురకాలవారైనారు. తెలుగు మాతృభాషగా కలవారు ఒకరకం, ఆ౦ధ్రేతరులు మరోరకం. ఆంధ్రేతరులు తెలుగు నేర్చుకోవటం నిత్యవ్యవహారంలో ఇబ్బంది లేకుండా జరుపుకోవటానికి కాబిట్టి వాళ్ళకోసం రాసిన పాఠ్యగ్రంథాల్లో వ్యావహారిక మే ఉండాలని భద్రిరాజు కృష్ణమూర్తిగారు వాదించి గ్రాంథికంలో ఉన్న పుస్తకం తమ చేతిమీదుగా అచ్చుకారాదని అభ్యంతరం లేవదీశారు. ప్రభుత్వం ఈ విషయంలో ఏకాభిప్రాయాన్ని సాధించాలన్న భావంతో అన్ని రంగాల్లోను విద్వాంసులను ప్రతినిధులను తిరుపతిలో సమావేశపరిచింది. "అనేక తర్జనభర్జనలయిన తర్వాత పింగళి లక్ష్మీకాంతంగారి అధ్యక్షతన ఆ సమావేశంవారు ఓకరాజీకి వచ్చారు. మొదటి భాషగా తెలుగు నేర్చుకొనేవాళ్ళ పాఠ్య గ్రంధాల్లోని తెలుగువాచకాలు మాత్రం సరళ గ్రా౦థికంలో ఉండాలని, రెండో భాషగా తెలుగు నేర్చే వాళ్ళుగాని, శాస్త్రవిషయాలను తేలుగులో నేర్చుకొనే ఆంధ్ర విద్యార్థులు గాని చదివే పాఠ్యగ్రంథాల్లో వ్యావహారికమే ఉండాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ప్రభుత్వంవారు ఈ నిర్ణయాన్ని ఆమోదించి వివరణాత్మకంగా ఆయా శైలీభేదాలను (గ్రా౦థకవ్యావహారికాలను శైలీ భేదాలుగా గుర్తించి వీటిని వివరించే సంఘాన్ని శైలీ సంఘం - Style Committee - అని ప్రభుత్వం వ్యవహరించింది) నిరూపించటానికి పింగళి లక్ష్మీకాంతంగారినే అధ్యక్షులుచేసి ఒక సంఘం నియమించారు. ఆ సంఘంవారు 1966 నాటికి తమ పని నెరవేర్చారు. తెలుగును రాజభాష చేయదలచిన ప్రభుత్వానికి ఈ నిర్ణయాలు చాలా అవసరం. తెలుగును అధికారభాషగా గుర్తిస్తూ 1966లో ఆంధ్రప్రదేశ్‌ అధికారభాషా చట్టం (9వ చట్టం) శాసించింది. తెలుగును అధికారభాష చేయటంలోని కష్టసుఖాలు పరిశీలించి సలహా ఇమ్మని ప్రభుత్వంవారు అప్పటి విద్యాశాఖాకార్యదర్శి జె.పి.ఎల్‌. గ్విన్‌ అధ్యక్షతన మరో సంఘం నియమించారు. (జి. ఓ. 3051, 1966 డిసెం. 28). గ్విన్‌ సంఘంవారు ముఖ్యంగా ఆంధ్రేతరులకు తెలుగు నేర్పటానికి భాషను ఆధునికీకరించటానికి, విశ్వవిద్యాలయాల్లో తెలుగును బోధనభాష చేయ