పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రం, తెనుగు, తెలుగు

9

1.11. ఈ వ్యాసంలో ఇంతవరకు చర్చించిన విషయ సారాంశం ఇది:

(1) ఆంధ్రులు ఆర్య అనార్య మిశ్రజాతి. వీరు ఉత్తరార్యావర్తం నుండి దక్షిణాపథానికి వచ్చి గోదావరి ప్రాంతంలో రాజ్యాన్ని స్థాపించుకొని అక్కడి ప్రజలతో కలిసిపోయినారు.

(2) జాతివాచకమైన ఆంధ్రశబ్దం క్రమంగా దేశవాచకంగానూ, భాషావాచకంగానూ రూఢిలోకి వచ్చింది.

(3) తెనుఁగు దేశ్యమైన దిగ్వాచి.

(4) తెలుఁగు శబ్దం తెనుఁగు శబ్దానికి రూపాంతరమే కాని త్రిలింగ శబ్ద భవం కాదు.

జ్ఞాపికలు

1. తమిళంలో సంగం సాహిత్యములో (కీ. శ, ప్రారంభం) కుఱుందొగై (పద్య సంఖ్య 11), అగవానూర్ (పద్యసంఖ్య 107), నఱ్ఱిణై ప్రద్య సంఖ్య 212 -- గ్రంథాల్లో వడుగర్ (ఉత్తరదేశస్థులు) అనగా 'తెలుగువారు' అను పదప్రయోగ ముంది. జయగొండార్ (11వశతాబ్ది) రచించిన కళింగత్తుప్పరణిలో తెలుంగరు (పద్య సంఖ్య 469), వడుగు (పద్య సంఖ్య 43) తెలుగుభాషలో ప్రయోగింప బడింది.

2. “Gentoo. From Portuguese gentio, a gentile or heathen. The name formerly applied by Europeans to the natives of the country, especially to the Teloogoo people, for when the Portuguese arrived the Teloogoo Raj of Vijayanugger was dominant over great part of the peninsula". Manual of the Administration of the Madras presidency, Vol. III. Madras (1893).

3. “తస్యహ విశ్వామిత్ర స్యైకళతం పుత్రా ఆసుః ; పంచాశత్ ఏక జ్యాయాంసో మధుచ్ఛందసః, పంచాశత్ కనీయాంసః; తద్వైజ్యాయాంసో నతే కులమ్ మేనిరే, తాన్ అనుబ్యాజహారన్ తాన్‌వః ప్రజా భక్షిస్తేతి ఏతేంధ్రాః పుండ్రాః శబరాః పుళిందా మూతిబా ఇత్యుదంత్యా బహవో భవంతి వైశ్వామిత్రా దస్యూనామ్ భూయిష్టాః"

(ఐతరేయ బ్రాహ్మణమ్ Asiatic Society of Bengal (1906), 7వ సంచిక , 3వ అధ్యాయం, 6 వ ఇండం).