పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

214 తెలుగు భాషా చరిత్ర

బాగా (<బాగుగన్), దాకా (<తనుకన్‌) ఇత్యాదులు అప్పటికీ ఇప్పటికీ వ్యాస హారికాలుగానే నిలిచిపోయాయి. లాక్షణికుల దృష్టిలో కేతన గ్రామ్యాలని నిషేధించిన రూపాల్లో ఈ విధంగా కలిగినవి ఉన్నాయి : వాటీ. మమ్ము, గొంటూ, మోసేటి, పంపేరు-ఇత్యాదులు, దేశినాదరించిన శివకవుల రచనల్లో ఇవి ఎక్కువగా కనబడ్డంలో ఆశ్చ్యర్యంలేదు. ఉదా : నన్నిచోడుడు సాము (<సగము; కు.సం 4-53 గ్రాము<గ్రహము (పై.10-17), మోము<మొగము.(పై. 6-13). ప్రత్యయ ము వర్ణలోపం : వైరాన<వైరమున (కు.సం. 4-61). పాల్కురికి సోమన: మాజనము< మహాజనము; మరాకు<మరువకు (బసవ పురాణం). మార్గకవుల గ్రంథాల్లో ఈ రూపాలు ప్రబంధ యుగం నుండి విశేషంగా ప్రవేశించాయి. (చూ. బాలకవి శరణ్యం).

7.7. ఇయ<ఎ : నన్నయ నన్నిచోడుల గ్రంథాల్లో ఇయాంతాలు, ఎత్వరూపాలు వాడబడినయి. ఉదా: భార: గద్దియ > గద్దె, పల్లియ>పల్లె, కన్నియ, పక్కియ, లొట్టియ. నన్నిచోడుడు : ఎడకత్తియ, చెలికత్తెలు, తేనియ తేనె ఉట్టియ, మల్లియ ఇత్యాదులు. కేతన ఆంద్రభాషా భూషణంలో ఇయాంతాలను ప్రస్తావిస్తూ మల్లియ-మల్లె, గద్దియ-గద్దె, లంజియ-లంజె ఇత్యాదులలో ఇయాంతాలనే కావ్యాల్లో ప్రయోగించాలని చెప్పాడు. అంటే అతని కాలానికి ఇంకా ఎత్వరూపాలకు వ్యావహారిక వాసన వదలలేదని అర్థం. తరువాతి కాలంలో ఎత్వరూపాలు శిష్టవ్యవహారంలో బాహాటంగా వాడబడడంచేత పూర్వకవి గ్రంథాల్లో క్వాచిత్కంగా నైనా ప్రయోగించబడి ఉండటంచేత అర్వాచీన లాక్షణికులైన అహోబలుడు, కూచిమంచి తిమ్మకవి వీటిని అంగీకరించారు.

7.8. డ->ద- : దేశ్యశబ్ధాల్లో పదాది డకారం చాల తక్కువ. నిజానికి ద్రావిడ భాషల్లో ఎక్కడా పదాదిని మూర్థన్యాక్షరం ఉండదు. ఉట్టిది తెలుగున వర్ణవ్యత్యయంవల్ల ప్రాఙ్నన్నయ యుగంలోనే ఏర్పడింది.* అఱచు>*ఱఅచు>ఱచ్చు > డచ్చు. ఇట్లే అడంగు > డాంగు > డాcగు. ఈ పదాది డకారం నన్నయ కాలంనుండి దకారంగా మారడం సంభవించింది. కావ్యాల్లో డ/ద ద్వై రూప్యం కనబడుతుంది. నన్నయ : డప్పి-దప్పి, డాcచు-దాచు; నన్నిచోడుడు : డాcగి-దాcపక, డాయన్‌-దాయన్‌ మొ.వి.

7.9. పదమధ్యాజ్లోపము : పదమధ్యాజ్లోపంతో కూడిన మార్పులు