పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

208

తెలుగు భాషా చరిత్ర

“ఓం: స్వస్తి శ్రీమత్‌ సత్యాశ్రయ శ్రీప్రిథివీ వల్లభ మహారాజాధిరాజు విక్రమాదిత్య; పరమేశ్వరభటారులాకున్‌ శ్రీమదున్నత ప్రవద్ధ౯మాన విజయరాజ్య సంవత్సరంబుళ్- ఆ చంద్రతారపురస్సరం ద్వితీయవర్షం ప్రవర్తమానం కానగొగ్గి భటారళ దక్షిణ భుజాయ మానుంఱయిన అలకుమర ప్రియతనయింఱయిన ఉజేనీ పిశాచ నామధేయింఱు తుఱుతటాక నామాభిధాన నగర ధిష్టానుంఱయి ఏఱువ విషయంబేళన్‌ తస్యమాతా దత్తం గోవృషాణ భట్టారహౌ శతపంచాశత్‌ క్షేత్రం,”

ఈ గద్యకూడా కావ్యశైలిలో రచించబడిందని వేరే చెప్పనవసరం లేదు. పైన నిరూపించిన గద్యశాసనాల్లోని భాషకూ, ఇతర గద్యశాసనాల్లోని భాషకూ స్పష్టమైన భేదం కనబడుతుంది. కావ్యశ్తై లిలో ఉన్నభాష సంధి సూత్రాలకు నియత ప్రవృత్తి, తత్సమ పదబాహుళ్యం, అన్వయ సౌష్టవంతో కూడిన వాక్యరచనా విధానం, ఈ లక్షణాలతో కనబడుతుంది. వ్యావహారిక భాషలో సంధి ఐచ్చికం. తత్సమ పదాలు విశేషంగా ఉండవు. వాక్యరచనకూడా కొంత అసాధారణంగాను, అసహజంగాను కనబడుతుంది. ఉదా : చోటి మహారాజు ఇందుకూరు (కడపజిల్లా) శాసనం (7వ శతాబ్దం ప్రధమపాదం) (AI 27,229-230).

“స్వస్త్రిశ్రీ” చోఱమహారాజు ల్లేళన్‌ ఎరిగల్‌ దుగరాజుల్‌ ఇచ్చిన పన్నస కొచ్చియ పాఱ రెవ సమ్మా౯రికిన్‌ | తేనిలచ్చిన న్ఱు పఞ్చ మహాపాతక సంయుక్తున్ఱుగు.

మొదటివాక్యంలో కర్మపదం చివరకు రావడం, రెండవ దానిలో 'దీనిని' అనడానికి బదులు తేని ( = దేని(ని ) అని - సంస్కృతంలో యత్‌-తత్‌ వాక్య నిర్మాణ ప్రభావంచేత కాబోలు - వాడడం విలక్షణం.

మరొక ఉదాహరణం : ఇదీ రేనాటిచోళుల శాసనమే. ఎర్రగుడిపాడు (కడప జిల్లా). 6 వ శతాబ్ది చతుర్ధపాదం. (AI2 7,225-8). ఒక వ్యాసవాక్యంలో చెప్పదగిన భావాన్ని మూడు చిన్నవాక్యాల్లో విరిచి చెప్పడం.

“స్వస్త్రిశ్రీ” ఎరికిల్ముత్తురాజుల్ల కుణ్ణి కాళ్ళు నివబుకాను ఇచ్చిన పన్నస దుజయరాజుల ముత్తురాజులు నవప్రియముత్తురాజులు పల్లవదుకరణాలు శక్షికాషు ఇచ్చిన పన్నస ఇరవది యాదినాల్కు మఱునుఱ్లు నేల.

చిన్న చిన్న వాక్యాల్లో, పునరుక్తితో ఈ విధ౦గా చెప్పడం వ్యావహారిక భాషలోనే కాని కావ్యభావలో ఒప్పదు, పై శాసనపంక్తులే కావ్యశైలిలో నడుస్తే వాక్యనిర్మాణం ఎలాఉండేదో మార్చిచూపవచ్చును. 'ఎఱికల్ముత్తు రాజల్లకుణ్డికాళ్ళు నివబుకాను దుజయరాజుల ముత్తురాజులు నవప్రియ ముత్తురాజులు వల్లవదుకరజులు