పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం 161

యగంలో వాండు అవడానికి వాండ్లు బహుత్వంలో కనిపిస్తుంది. అయిన వాండ్లు (SII 10.751.23, 1592). యక్కడివాండ్లు (పై. 10.751.25,1592), పిల్లవాండ్లు (NI 8 రాపూరు 11-19,1570)మొ.వి.

క్రియలు

5.42 క్రియాప్రాదికల విషయంలో పూర్వయుగానికీ ఈ యగానికీ అట్టె తేడా చెప్పలేము. కాని ఈ క్రియాప్రాతిపదికలతో ప్రత్యయాలు చేరేటప్పుడు సంధి మార్పుల విషయంలో ఈ యుగంలో స్పష్టమైన కొన్ని విశేషాలు కనిపిస్తాయి. పోవు ప్రాతిపదికకు అన్నంతమగునప్పుడు వు లోపించి బిందువు వచ్చుట ఈయుగంలో సర్వత్ర జరగుతుంది. పోంగలరు, (SII 6.709.13,1436), పోంగల వారు (పై. 6.248,60,1515), పోంగను (పై. 6.1040.4, 1417) మొ.వి.

5.43. .ఇంచు ప్రత్యయం చేరిన ధాతువులకు అచ్చులతో ప్రారంభమయ్యే ప్రత్యయాలు చేరగా, ఈ యుగంలో ఇంపుగా మారుతాయి. ఇట్టివి తూర్పు గోదావరి శ్రీకాకుళం మధ్యలో 15వ శతాబ్దిలో విపుల ప్రచారంలో ఉండినా మిగిలినప్రాంతాల్లో కనిపించవు.

సమర్చించిన మూల్యం (SII 6.5. 10, 1410) కాకినాడ తూ. గో

ఎవ్వరు విరోధింపినాను (పై, 5. 10.12,1404)

సమర్పి౦పేను (పై. 5.84.28, 1424)

సమర్చింపిరి (పై. 5.47.23,1424)

ఆరాధింపి (పై. 5.52.6,1428)

సమర్పి౦పెను (ఫై. 5.102.12,144బ) పెద్దావురం

సమర్పి౦పి (ఫై. 5.1౦3.11, 1408)

సమర్పింపెను (పై. 5.118,21,1488) రాజమండ్రి

నడిపి[౦]పి (పై. 6.656.19,1417) సర్వసిద్ధి విశాఖ

సమర్సింపెను (పై. 6.667.18,1422)

సమర్పింపెను (పై. 6.867.22,1452)

అవధరింపిరి (పై. 676.11, 1480)

(11)