పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

13



(1) వృషభాచలము.

వృషభాసురుడను రాక్షసుడు కృతయుగములో నీ పర్వత మందు తుంబురకోనలోనుండి మునులను బాధించుచుండెను. ఆ మునిశ్రేష్ఠులు తమ తపస్సునకు భంగము గలుగకుండునట్లు శ్రీ మహావిష్ణువును బ్రార్ధించిరి. ఈ వృషభాసురుడు తంబుర తీర్థములో ప్రతినిత్యము స్నానము చేయుచు శ్రీనృసింహసాలిగ్రామము నర్చించుచుఁ బూజానంతరంబున ఖడ్గముతోగ తన శిరము ఛేదించి యాశిరంబు నొక పుష్పంబుతోఁగూడ సమర్పించుచుండెను. ఛేదించిన వెంటనే శిరంతనికి యధాప్రకారంబు వచ్చుచుండెను. ఇటుల 5000 సంవత్సరంబు లారాధనము చేయ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షముకాఁగా నా యసురుడు దండ ప్రణామంబులుగావించి స్తుతించి తనకు మోక్షముగాని స్వర్గము గాని పరమపదముగాని అనవసరంబనుచు శ్రీ వారితో యుద్ధంబు చేయ నిచ్ఛగలదని విన్నవింపవల్లెయని యానతినిచ్చిరి. యుద్ధములో నీ రక్కసుడు శ్రీవారితోగూడ పోరాడుచు వారే రూపము దాల్చిన తానారూపము ధరించుచుండెను. విశ్వరూపము ధరించిన విశ్వరూపమును, గరుడవాహనారూఢుడుగనుండ తానునట్లుకాగా శ్రీవారు సుదర్శన ప్రయోగముచే శిరచ్ఛేదనం బొనర్చెనంత చక్రపాణికి నమస్కరించి సుదర్శన మహిమవింటిని చక్రహతులకు పరమపదము నిస్సంశయము. చక్రానలదగ్ధుడగు నే నామందిరమునకుఁ బోవుచున్నాను.

శ్లో|| ఏవముక్త్వాహరేఃపాదౌ పస్పర్శవృషభాసురః |
వరంయయాచేవృషభ శ్శైలో మదభిధోస్త్వితి||