పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర

9

మైళ్ల దూరమున నున్నది. ఇదే మాదిరిగ తిరుపతికి 3 మైళ్ల దూరమున మామండూరు మిట్ట ఠాణా అనియు నాల్గు మైళ్ల దూరమున ముగ్గుభావి ఠాణాయు గలవు. మూడు ఠాణాల వద్దను భావులు గలవు. ఠాణాలలోని భటులు యాత్రికులకు మిగుల సహాయముగ నుండెదరు.

ఇదిగాక అలిపిరి మొదలు మామండూరు మిట్ట వరకు కావలిగా నిద్దఱు దేవస్థానపు భటులు తిరుపతి సబ్ మేజస్ట్రేట్ స్వాధీనములో నుందురు.

7. చలివేంద్రలు - భావులు.

ఈ మార్గమున చలివేంద్రలు మెండు. ముగ్గుబావి ఠాణా యొద్దను మామండూరు మిట్ట ఠాణా సమీపమున దేవస్థానపు చలివేంద్రలు గలవు. నాల్గవజాతి వారు మంచి తీర్థము దాహమిచ్చెదరు. తిరుపతినుండి పోవునప్పుడు కోన ఎక్కుడు దాటిన తర్వాత రెండు పర్లాంగుల దూరమున నొక దేవస్థానపు చలివేంద్ర గలదు. ఇచ్చట మజ్జిగ మంచి తీర్థము బ్రాహ్మణు డొకడు శూద్రు డొకడుండి దాహమిచ్చెదరు. ఈ మూడు చలివేంద్రల వద్ద దాహమునకుగా నేమియునియ్యనక్కఱలేదు.

శ్లో|| వేంకటాఖ్యే మహాపుణ్యే తృషార్తానాం విశేషతః|
జలదాన మకుర్వానః తిర్యగ్యోని మవాప్నుయాత్.

స్కందపురాణం.

మామండూరు మిట్ట, ముగ్గుభావి, కోనఠాణాల వద్ద భావులు గలవు. యాత్రికులిందలి నీరుపయోగించు కొనవచ్చును.