పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

67

తెఱచెదరు. ఈ ప్రకారాము సంవత్సరమున కొకదివసము మాత్రము తెరవబడును. ఈసాయంకాలమున స్వభూవాలవాహనములో శ్రీవార్లకు వజ్రకవచము మొదలగు విశేషాభ రణములు సమర్పణ చేసి ఉత్సవముజరుగును. ఈరాత్రి తీర్మానమయిన శీఘ్రకాలములోన తలుపులు తెరచి ధనుర్మాసపుపూజనివేదనయు నిత్యకట్ల తోమాల సేవ, అర్చన ఘంటఁయి చక్రత్తాళ్వారు మహాప్రదక్షణముగ శ్రీ స్వామిపుష్కరణిలో తెల్ల వారు సమయమున స్నాన మొనరించెదరు. ఈసమయమే పుణ్యకాల మని చెప్పెదరు. అప్పుడందఱును స్నానము చేసెదరు.శ్రీస్వామి పుష్కరణిచూచుట కాహ్లాదకరముగ నాలుగు ప్రక్కలున్నా ఇముఁ జేయు జనులతో నిండియుండును . ఈ సమయమందు శ్రీస్వామి పుష్కరిణిలో 360 తీర్థములు కలియుననియు,సమస్త దేవతలును ఆసమయమున వచ్చి స్నానమాచరించెద రనియు చెప్పెదరు. ద్వాదశినాడు సాయంకాలము వైకుంకాప్రాకారము తలుపులు వేయుదురు.

9 అధ్యయనోత్సవము.

ఇది 25 దివసములు జరుగును. ఈదివసములలో శ్రీ ఉత్సవరులు బ్రహ్మోత్సవములోవలె కళ్యాణమంటపములో నుందురు. ప్రతిదివసము తీర్మానమునకు ముందు అచ్చటాస్థానము జరుగును. ఈదివసములలో వేదాధ్యయనమును, ద్రవిడ వేదమగు ప్రబంధ పఠనము నుండును. దేవస్థానములో నేదైన వైదికలోపము తెలియక జరిగినయడల దానివి హరించుటకు నీ యుత్సవ మేర్పడినదని కొందఱి మతము. మఱికొండఱు దానిని తిరువధ్యయనోత్సవమునెదరు.