పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తరిగొండ నృసింహశతకము

[1]శ్లో.

శ్రీకాంతాత్మసరోజ చండకిరణం, శీతాంశు బింబాననం,
శ్రీకంఠాబ్జజ సన్నుతాంఘ్రికమలం, చిన్మాత్ర, మప్రాకృతమ్।
లోకాతీత, మనేక గోపయువతీలోలం, పరం, సర్వగం,
స్వాకారం తరిగొండ శేషకుధరాధ్యక్షం భజే౽హం సదా॥

భావం:

శ్రీమహాలక్ష్మియొక్క మనస్సనే పద్మాన్ని వికసింపజేసే సూర్యుడూ, చంద్రబింబంవంటి ఆహ్లాదకరమైన ముఖం కలవాడూ, పరమశివునిచే, బ్రహ్మదేవునిచే స్తుతింపబడిన చరణకమలాలు కలవాడూ, జ్ఞానస్వరూపుడూ, లోకాలన్నిటికి అతీతుడూ, అనేకగోపయువతులయెడ అనురాగం కలవాడూ, అంతటా వ్యాపించియుండే సత్యస్వరూపుడూ, దేవాదిదేవుడూ, పరంధాముడూ అయిన తరిగొండ (లక్ష్మీనృసింహుడు) అనే శేషాచలాధిపతి యయిన వేంకటేశ్వరుణ్ణి నిత్యం భక్తితో ఆరాధిస్తున్నాను.

  1. ఈ శ్లోకం వెంగమాంబ తిరుమలక్షేత్రంలో రచించిన కృతుల్లో అగ్రగణ్యమయిన "శ్రీ వేంకటాచలమాహాత్మ్య" మనే పద్యకావ్యంయొక్క ప్రారంభంలో ఉంది. స్తుతిసుందరమైన ఆ శ్లోకాన్ని కవయిత్రి తరువాతి కాలంలో ఈ శతకానికి మొదట తిలకాయమానంగా చేర్చినట్లు భావింపవీలౌతున్నది.