పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

85

34. నవాబ్‌ సయ్యద్‌ ముహమ్మద్‌

(1867- 1919)

బ్రిటిష్‌ వ్యతిరేక పోరాట వీరుల జాబితాలో ప్రముఖ స్థానం ఆక్రమించిన మైసూరు పులి టిపూ సుల్తాన్‌ వారసత్వాన్నికొనసాగిస్తూ ఆయన ఆశయాలను అనుగుణంగా వ్యవహరించిన జాతీయ ఉద్యమకారులలో నవాబ్‌ సయ్యద్‌ ముహమ్మద్‌ ఎన్నదగినవారు.

1867లో జన్మించిన సయ్యద్‌ ముహమ్మద్‌,టిపూ సుల్తాన్‌ నాల్గవ కుమారుడైన సుల్తాన్‌ యాసిన్‌ కుమారై రుఖ్‌ బేగంకు తల్లి పక్షాన మనుమడు. 1867లో జన్మించిన ఆయన విద్యాభ్యాసం మద్రాసు నగరంలో జరిగింది. ఆ తరువాత తండ్రి మీర్‌ హుమాయున్‌ మార్గదర్శకత్వంలో వాణిజ్యరంగ ప్రవేశం చేసి అత్యధికంగా గడించారు.

ఒకవైపు వ్యాపార బాధ్యతలు నిర్వహిస్తూనే రాజకీయ -ప్రజాసేవా రంగాల వైపు సయ్యద్‌ ముహమ్మద్‌ దృష్టి సారించారు. 1894లో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సభలో సభ్యత్వం స్వీకరించిన ఆయన 1896 సంవత్సరంలో మద్రాసు నగరానికి తొలి ముస్లిం షరీఫ్‌గా ఎంపికై చరిత్ర సృష్టించారు.1897లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనను నవాబు బిరుదుతో సత్కరించింది. 1900 సంవత్సరంలో ఆయన మద్రాస్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు ఎంపికయ్యారు. 1901లో భారత జాతీయ కాంగ్రెస్‌ కమిటీసభ్యులయ్యారు.

ప్రజల ఆర్థిక-రాజకీయ- సాంఫిుక చైతన్యం కోసం కృషి ఆరంభించిన ఆయన

చిరస్మరణీయులు