67
25. షెహజాదా ఫిరోజ్ షా
(1832- 1877)
మాతృభూమిని విముక్తం చేసేందుకు సాగిన సుదీర్గ… స్వాతంత్య్ర పోరాటంలో సామాన్యుల నుండి సంస్థానాధీశులు, రాజుల నుండి రాజకుమారుల వరకు పాల్గొన్నారు. ఆ పరంపరలో భాగంగా అత్యంత సుఖమయమైన జీవితాన్నిత్యజించి, కంఠంలో ఊపిరి ఉనన్నంతవరకు బ్రిటిషర్లతో పోరాడి భారత స్వాతంత్య్రపోరాటాల చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టించిన యోధులు మొఘల్ రాకుమారుడు ఫిరోజ్ షా.
మొఘల్ పాదుషా షా ఆలం మనుమడు మీర్జా నిజాం భక్త్ కుమారుడు ఫిరోజ్ షా. 1832లో ఢిల్లీలో జన్మించిన ఆయన 1855 మేలో మక్కాకు వెళ్ళి 1857 మేలో స్వదేశం వచ్చేసరికి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ నినాదాం అంతా ప్రతిధ్వనిస్తోంది. ఆ శంఖారావంతో ఉత్తేజం పొంది 1857 న్లో గ్వాలియర్ సంస్థానంలోని మాండిసోర్ను కేంద్రంగా చేసుకుని ఆంగ్లేయుల మీద పోరుకు ఆయన సిద్ధమయ్యారు.
బ్రిటిషర్ల అనుకూలుడైన గ్వాలియర్ సంస్ధానాధీశుడు ప్రభుభక్తిని చాటుకునేందుకు మాండిసొర్ వదలి వెళ్ళాల్సిందిగా ఫిరోజ్ షాను ఆదేశించాడు. ఆ హెచ్చరికలను ఖాతరు చేయని ఫిరోజ్ షా నగరం బయట మకాం చేశారు. ఆయన ప్రయత్నాల ప్రభావంతో మాతృభూమి కోసం ప్రాణాలు త్యాగం చేసేందుకు ప్రజలు, యువకులు, స్వదేశీ సైనికులు
చిరస్మ రణీయులు